Asianet News TeluguAsianet News Telugu

చెన్నైకి షాక్: ఐపీఎల్ ఫైనల్ మన హైదరాబాద్‌లోనే..?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త... ఐపీఎల్ 2019 ఫైనల్ అన్ని కుదిరితే మన భాగ్య నగరంలోనే జరగే సూచనలు కనిపిస్తున్నాయి

ipl 2019 final may be shifted to hyderabad uppal stadium
Author
Hyderabad, First Published Apr 9, 2019, 9:05 AM IST

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త... ఐపీఎల్ 2019 ఫైనల్ అన్ని కుదిరితే మన భాగ్య నగరంలోనే జరగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది ఐపీఎల్ ఫైనల్ ముందు సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టు సొంతగడ్డపై జరగుతూ వస్తోంది.

ఈ లెక్క ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ సొంత గ్రౌండ్ చెపాక్‌లో ఈ ఏడాది ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ ఫైనల్ వేదికను ఉప్పల్ స్టేడియానికి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు క్రికెట్ సంఘం నిర్మించిన చెపాక్ స్టేడియంలో మూడు స్టాండ్స్ విషయంలో వివాదం నెలకొని ఉంది. 2012లో నిర్మించిన ఈ స్టాండ్స్‌కు చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి నిరాకరించింది.

దీంతో 12 వేల సామర్థ్యం ఉన్న ఈ స్టాండ్స్ నాటి నుంచి ఖాళీగా ఉంటుంన్నాయి. దీంతో మ్యాచ్ జరిగిన ప్రతీసారి ఈ స్టాండ్స్ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మున్సిపల్ కార్పోరేషన్, తమిళనాడు క్రికెట్ సంఘం మధ్య వివాదం పరిష్కారం కాకపోవడం.. ఈ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించుకోవాలని ఐపీఎల్ నిర్వాహకులు చెన్నైకు సూచించారు.

లేని పక్షంలో ఫైనల్‌ను హైదరాబాద్‌కు.. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లను బెంగళూరుకు తరలించాలని బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు క్రికెట్ సంఘాన్ని హెచ్చరించింది. మరోవైపు ఐపీఎల్ సందర్భంగా నాలుగు మహిళా మ్యాచ్‌లు నిర్వహించాలని సోమవారం బీసీసీఐ సమావేశంలో బోర్డు నిర్ణయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios