5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన టీమిండియా... ఒకే ఇన్నింగ్స్తో మూడు రికార్డులు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ...
వెస్టిండీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో మరోసారి భారత బ్యాటర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. అగ్రెసివ్ బ్యాటింగ్ యాటిట్యూడ్తో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరు చేసింది... వర్షం కారణంగా దాదాపు 20 నిమిషాల ఆలస్యంగా ఆట ప్రారంభమైనా ఆ ప్రభావం భారత బ్యాటర్లపై పెద్దగా పడలేదు..
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ కలిసి తొలి వికెట్కి 53 పరుగుల భాగస్వామ్యం అందించారు. వస్తూనే బాదుడు మొదలెట్టడంతో 4.3 ఓవర్లలోనే భారత స్కోరు బోర్డు హాఫ్ సెంచరీ మార్కును దాటేసింది. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు...
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, ఎమ్మెస్ ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ఏడో భారత క్రికెటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. అలాగే ఓపెనర్గా టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన రెండో బ్యాటర్గానూ నిలిచాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, రోహిత్ కంటే ముందు ఈ ఫీట్ సాధించాడు...
అలాగే ఈ ఇన్నింగ్స్లో 3 సిక్సర్లతో అంతర్జాతీయ కెరీర్లో 477 సిక్సర్లను పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, క్రిస్ గేల్ తర్వాత అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్గా నిలిచాడు. 476 అంతర్జాతీయ సిక్సర్లు బాదిన పాక్ మాజీ క్రికెటర్ షాహిదీ ఆఫ్రిదీని దాటేసిన రోహిత్ శర్మ, 477 సిక్సర్లతో 553 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు.
రోహత్ శర్మను అకీల్ హుస్సేన్ క్లీన్ బౌల్డ్ చేయగా 14 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, అల్జెరీ జోసఫ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్...
వన్డౌన్లో వచ్చిన దీపక్ హుడా 19 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి అవుట్ కాగా రిషబ్ పంత్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసి మెప్పించాడు. దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో 6 పరుగులు చేసి ఓబెడ్ మెక్కాయ్ బౌలింగ్లో బౌల్డ్ కాగా సంజూ శాంసన్ 23 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 30 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు..
ఆఖర్లో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ 8 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి మెరుపులు మెరిపించి భారత స్కోరు కార్డుని 190 దాటించాడు.
