టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... టెస్టు ఆరంగ్రేటం చేస్తున్న ముకేశ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ ప్లేస్‌లో తుది జట్టులోకి... 

టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. నేటి మ్యాచ్ ద్వారా ముకేశ్ కుమార్, టెస్టు ఆరంగ్రేటం చేస్తున్నాడు. 

తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు, 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. గత మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసుకోగా ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్ 171 పరుగులతో రికార్డు పర్ఫామెన్స్ ఇచ్చాడు..

విరాట్ కోహ్లీ 76 పరుగులతో రాణించగా శుబ్‌మన్ గిల్, అజింకా రహానే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. టీమిండియా రెండు రోజులకు పైగా బ్యాటింగ్ చేసినా అందరికీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు...  డొమినికాతో పోలిస్తే ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

గత మ్యాచ్‌లో వెస్టిండీస్ టీమ్‌లో ఏ బ్యాటర్ కూడా 50+ స్కోరు నమోదు చేయలేకపోయాడు. ఆరంగ్రేటం ఆటగాడు అలిక్ అతరానే తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 47 పరుగులే, విండీస్ టీమ్‌లో అత్యధిక స్కోరు..

ఇండియా  - వెస్టిండీస్ మధ్య ఇది 100వ టెస్టు మ్యాచ్. ఈ మ్యాచ్‌కి ముందు వరకూ ఇరు జట్ల మధ్య 99 టెస్టులు జరగగా 30 టెస్టుల్లో వెస్టిండీస్ విజయం అందుకుంది. 23 టెస్టుల్లో టీమిండియా గెలవగా 46 టెస్టులు డ్రాగా ముగిశాయి. 2002 నుంచి వెస్టిండీస్, టీమిండియాపై టెస్టు విజయాన్ని అందుకోలేదు..

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఇది 500వ అంతర్జాతీయ మ్యాచ్‌. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, మహేళ జయవర్థనే, కుమార సంగర్కర, సనత్ జయసూర్య, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ, రికీ పాంటింగ్, షాహిద్ ఆఫ్రిదీ, రాహుల్ ద్రావిడ్ మాత్రమే 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడారు..

ఓవరాల్‌గా 500లకు పైగా అంతర్జాతీయ మ్యాచులు ఆడిన 10వ క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు. శ్రీలంక నుంచి ముగ్గురు ఈ ఫీట్ సాధించి, టీమిండియా తర్వాతి ప్లేస్‌లో ఉన్నారు..

వెస్టిండీస్ జట్టు ఇది: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెక్‌కెన్జీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అతనజే, జుషువా డి సిల్వ, జాసన్ హోల్డర్, అల్జెరీ జోసఫ్, కీమర్ రోచ్, జోమెల్ వర్రీకాన్, షన్నాన్ గ్యాబియల్

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, జయ్‌దేవ్ ఉనద్కట్, ముకేశ్ కుమార్, మహ్మద్ సిరాజ్