Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని వృధా చేస్తున్నారని అతడిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు. ఈ చలానాను అతడి ఇంటికి పంపించినట్లు ఓ మున్సిపల్ అధికారి తెలిపారు.

Indian skipper Virat Kohli fined Rs 500 for using drinking water to wash cars
Author
Gurugram, First Published Jun 7, 2019, 9:06 PM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి గురుగ్రామ్ మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. మున్సిపాలిటీ సరఫరా చేసే నీటిని వృధా చేస్తున్నారని అతడిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు కోహ్లీకి రూ.500 జరిమానా విధించారు. ఈ చలానాను అతడి ఇంటికి పంపించినట్లు ఓ మున్సిపల్ అధికారి తెలిపారు.

విరాట్ కోహ్లీ బాలివుడ్ భామ అనుష్క శర్మ  ను పెళ్లిచేసుకుని ముంబైలో నివాసముంటున్న విషయం తెలిసిందే. అయితే స్వతహాగా డిల్లీకి చెందిన కోహ్లీకి గురుగ్రావ్ లో కూడా ఓ ఇళ్లు వుంది. అయితే ఆ ఇంట్లో కార్లను శుభ్రం చేయడానికి మున్సిపాలిటీ సప్లయ్ చేసే నీటిని ఇష్టం వచ్చినట్లు వాడుతునట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ నీరంతా రోడ్డుపై పారుతూ ఆ ఇంటి చుట్టుపక్కల వుండే వారికి చాలా ఇబ్బందిని కలిగిస్తోంది. 

దీంతో వారంతా కలిసి గురుగ్రావ్ నగర్ నిగమ్ అధికారులకు దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ ఇంటి యజమాని కోహ్లీకి రూ.500 ఫైన్ విధిస్తూ చర్యలు తీసుకున్నారు. నీటి వృధాను అరికట్టడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ ఇంజినీర్ అమన్ ఫొగట్ పేర్కొన్నారు. కోహ్లీతో పాటు మరో పదిమందికి కూడా చలాన్లు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios