ఆస్ట్రేలియా టూర్కి టీమిండియా... మూడు వన్డేలు, మూడు టీ20లతో పాటు ఓ టెస్టు మ్యాచ్...
సెప్టెంబర్ 21 నుంచి ఆస్ట్రేలియా టూర్కి భారత మహిళా జట్టు... మూడు వన్డే, టీ20 సిరీస్లతో పాటు ఓ టెస్టు మ్యాచ్ ఆడనున్న టీమిండియా...
ఇంగ్లాండ్ టూర్లో వన్డే, టీ20 సిరీస్ కోల్పోయినా, టెస్టు మ్యాచ్లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది భారత మహిళా జట్టు. ఇంగ్లాండ్ టూర్ తర్వాత కొన్నాళ్లుగా బ్రేక్లో ఉన్న భారత మహిళా టీమ్, ఆస్ట్రేలియా టూర్కి బయలుదేరి వెళ్లనుంది...
టీమిండియా వుమెన్స్ ఆస్ట్రేలియా టూర్కి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్, అక్టోబర్ 10న ముగియనుంది...సెప్టెంబర్ 21న మొదటి వన్డే, ఆ తర్వాత 24, 26 తేదీల్లో రెండు, మూడో వన్డేలు జరుగుతాయి.
వన్డే సిరీస్ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకూ నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ ఆడుతుంది భారత మహిళా క్రికెట్ జట్టు...ఆ తర్వాత అక్టోబర్ 7న మొదటి టీ20, 9న రెండో, 10న మూడో టీ20 మ్యాచులు జరుగుతాయి. వన్డే, టెస్టు మ్యాచ్లకు మిథాలీరాజ్ కెప్టెన్గా వ్యవహరిస్తే, టీ20లకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా వ్యవహరిస్తుంది.