లండన్లో భారత జెండా ఎగురవేసిన విరాట్ కోహ్లీ... మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు...
లార్డ్స్ స్టేడియంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ పాల్గొన్న భారత క్రికెటర్లు, కుటుంబసభ్యులు...
ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఉన్న టీమిండియా... లండన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది. 200 ఏళ్ల పాటు భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయుల రాజధాని లండన్ నగరంలో భారత జెండా రెపరెపలాడింది. ఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు, సహాయక సిబ్బందితో పాటు టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
భారత సారథి కోహ్లీ జెండాను ఎగురవేయగా... కోచ్ రవిశాస్త్రి, విరాట్తో పాటు జెండా అధిరోహణకు వచ్చాడు. లండన్లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది బీసీసీఐ...
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ దీప్తి శర్మకు అరుదైన గౌరవం కల్పించింది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యాజమాన్యం. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆటను గంట మోగించి ఆరంభించింది దీప్తి శర్మ.