Asianet News TeluguAsianet News Telugu

జియో యూజర్స్ కి శుభవార్త... క్రికెట్ ప్రసారాలు కూడా ఉచితమే

జియో తమ వినయోగదారులకు క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలను కూడా వీక్షించే అవకాశాన్ని కల్పించింది. జియో టీవిలో కేవలం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటం మాత్రమే కాదు...స్థానిక బాషలో  కామెంటరీ వింటూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని జియోయోగదారులు ఈ నెల 15 నుండి పొందనున్నారు.   

India Vs South Africa T20 series livestream free in JioTV
Author
Hyderabad, First Published Sep 13, 2019, 8:53 PM IST

జియో...ఈ పేరు టెక్నాలజీ రంగంలో పెను సంచలనం. ఇప్పటికే కమ్యూనికేషన్ రంగంలో ఫెను సంచలనాలను సృష్టించిన జియో ఇప్పుడు మరిన్ని రంగాల్లోకి దూసుకెళ్లేందుకు సిద్దమైంది. సినిమా, టెలివిజన్ రంగాలతో పాటు క్రీడా రంగంలోకి తమ సేవలను విస్తృతం చేయడానికి రంగం సిద్దంచేసింది. ఈ క్రమంలోనే భారత్-సౌతాఫ్రికాల మధ్య జరిగే టీ20 సీరిస్ ను తమ వినియోగదారులకు ఉచితంగా అందించాలని జియో నిర్ణయించింది.

సెప్టెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే మూడు టీట్వంటీ మ్యాచ్ ల సీరిస్ ను జియో టీవి ప్రత్యక్షంగా ప్రసారం చేయనుంది. ఇందుకోసం ఎలాంటి అదనపు  చార్జీలు వసూలు చేయబోమని జియో ప్రకటించింది. అంతేకాకుండా వివిధ ప్రాంతీయ బాషల కామెంటరీతో ఈ  మ్యాచ్ లను వీక్షించే సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు తెలిపింది. ఎప్పటిలాగే హిందీ, ఇంగ్లీష్ బాషలతో పాటు తెలుగు, తమిళం, కన్నడ వంటి ప్రాంతీయ బాషల కామెంటరీతో మ్యాచ్ ప్రసారాలు  జరగనున్నాయి. ఇందుకోసం అధికారిక ప్రసారదారులైన స్టార్ ఇండియాతో జియో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  

ఈ  సదుపాయం జయో టీవి  యాప్ ను కలిగిన వినియోగదారులే పొందవచ్చు. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ల ద్వారా వినియోగదారులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా తీసుకువచ్చిన జియో క్రికెట్ హెచ్‌డి ఛానల్లో కూడా ఇండియా-సపారీల పోరును ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios