ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో టెస్టుపై నీలిమేఘాలు... ముంబైలో భారీ వర్షాలు, మ్యాచ్పై అల్పపీడన ప్రభావం...
అరేబియా మహా సముద్రంలో అల్పపీడనం... రానున్న 48 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని తెలిపిన వాతావరణ శాఖ... రెండో టెస్టుకి వర్షం అంతరాయం?
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగాల్సిన రెండో టెస్టు మ్యాచ్పై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ముంబైతో పాటు మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ, కేంద్ర అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు...
వర్షం కారణంగా గురువారం భారత్, న్యూజిలాండ్ జట్ల ప్రాక్టీస్ సెషన్స్ పూర్తిగా రద్దయ్యాయి. శుక్రవారం కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.
అదీకాకుండా అరేబియా సముద్రంలోని అల్పపీడనం ఏర్పడిందని, ఇది క్రమంగా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది... ఈ అల్పపీడన ప్రభావం వల్ల ముంబైతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని చాలా ఏరియాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది...
గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా వాంఖడే స్టేడయం తడిసి ముద్దయ్యింది. వాతావరణ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే మొదటి రోజు ఆట పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది. అలాగే రెండు, మూడు రోజుల్లోనూ వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది...
వాంఖడే స్టేడియంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 2016లో వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 235 పరుగులు చేసి అదరగొట్టాడు విరాట్ కోహ్లీ.ఈ మ్యాచ్ తర్వాత ఐదేళ్లకు ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...
వాంఖడే స్టేడియంలో 6 ఇన్నింగ్స్ల్లో 72.16 సగటుతో 433 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉండగా, ఇంగ్లాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో డబుల్ సెంచరీ నమోదు చేశాడు..
గత రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ, మళ్లీ తన ఫెవరెట్ వాంఖడే స్టేడియంలో 71వ సెంచరీ సాధిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అయితే వరుణుడి రూపంలో వారి ఆశలు కుండపోత వర్షం కురిసే ప్రమాదం కనిపిస్తోంది...
భారత టెస్టు ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్కి కూడా ఇక్కడ మంచి రికార్డు ఉంది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్లు తీసిన అశ్విన్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో 2012లో 2, 2013లో వెస్టిండీస్పై 7, 2016లో ఇంగ్లాండ్పై 12 వికెట్లు తీశాడు...
విరాట్ కోహ్లీ తుదిజట్టులోకి రీఎంట్రీ ఇస్తుండడంతో కాన్పూర్ టెస్టులో ఆడిన ప్లేయర్లలో ఎవరిని తప్పిస్తారనే అనుమానంగా మారింది. శ్రేయాస్ అయ్యర్ ఆరంగ్రేట మ్యాచ్లోనే అదరగొట్టడంతో అజింకా రహానే టార్గెట్ అయ్యాడు...
అయితే వైస్ కెప్టెన్ అజింకా రహానేకి సపోర్ట్గా నిలిచిన టీమిండియా మేనేజ్మెంట్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను తప్పించి... విరాట్ కోహ్లీని తుది జట్టులో చేర్చాలని భావిస్తున్నట్టు సమాచారం...
వన్డౌన్లో వచ్చే ఛతేశ్వర్ పూజారాని ఓపెనర్గా పంపించి... మూడో స్థానంలో అజింకా రహానే, టూ డౌన్లో విరాట్ కోహ్లీ... ఐదో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను ఆడించాలని టీమిండియా భావిస్తుందని టాక్...