హార్దిక్ పాండ్యాకి నీతా అంబానీ పరామర్శ... మీరే నా స్ఫూర్తి అంటూ..
2018 సెప్టెంబర్లో ఆసియాకప్లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజయవంతమైనట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాని ముంబయి ఇండియన్స్ యజమాని నీతా అంబానీ పరామర్శించారు. ఇటీవల లండన్ లో హార్దిక్ వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీతా అంబానీ... లండన్ వెళ్లి మరీ హార్దిక్ ని పరామర్శించారు.
ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. నీతా అంబానీ తనకు పుష్పగుచ్చం ఇస్తున్న ఫోటోని ట్వీట్ చేసి.... తనను పరామర్శించడానికి వచ్చినందుకు దన్యవాదాలు తెలిపాడు.
‘నన్ను పరామర్శించడానికి లండన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ వదిన. మీ మాటలు ఎప్పుడూ నాలో ప్రోత్సాహం నింపుతాయి. మీరు ఎప్పుడూ నాకు స్ఫూర్తిగానే ఉంటారు’ అంటూ హార్దిక్ ట్వీట్ చేశాడు.
2018 సెప్టెంబర్లో ఆసియాకప్లో గాయపడ్డాడు పాండ్యా.. ఇక, అప్పటి నుంచి తీవ్రమైన వెన్ను నొప్పితో ఇబ్బంది పడగా.. తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్కు సెలక్టర్లు పక్కనబెట్టారు.. ఆ తర్వాత లండన్ వెళ్లి.. ఆస్పత్రిలో చేరిన శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్ పాండ్యా.. తనకు జరిగిన సర్జరీ విజయవంతమైనట్టు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
"తాను త్వరగా కోలుకోవాలని విషెస్ చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన పాండ్యా.. త్వరలోనే మళ్లీ మైదానంలో దిగుతానని పేర్కొన్నాడు. ఇక, పాండ్యా ట్వీట్కు రిప్లే ఇచ్చింది బీసీసీఐ.. విష్ యూ ఏ స్పీడ్ రికవరీ అని కామెంట్ పెట్టింది.. ఇప్పుడు తాజాగా పూర్తిగా కోలుకుంటున్నానంటూ ఇటీవల వీడియో షేర్ చేశాడు.