Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ లో మొదలైన కరోనా అలజడి: తొలి పాజిటివ్ కేసు నమోదు

ఆగస్టు 20-24న యుఏఈకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్న ప్రాంఛైజీలు అప్పుడే పరీక్షల దశ ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌ పాజిటివ్‌గా తేలినట్టు ప్రాంఛైజీ బుధవారం వెల్లడించింది. 

First Coronavirus Case registered In IPL2020, Rajastha Royals Fielding Coach Tests Positive
Author
Jaipur, First Published Aug 13, 2020, 7:53 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020లో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైంది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 13 సీజన్‌ను సెప్టెంబర్‌ 19-నవంబర్‌ 10వరకు యుఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టడానికి ముందు ఐదుసార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌గా రావాలి. ముందుజాగ్రత్తతో ప్రాంఛైజీలు 6-7 సార్లు కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాయి. 

ఆగస్టు 20-24న యుఏఈకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్న ప్రాంఛైజీలు అప్పుడే పరీక్షల దశ ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌ పాజిటివ్‌గా తేలినట్టు ప్రాంఛైజీ బుధవారం వెల్లడించింది. 

కరోనా పాజిటివ్‌ విషయాన్ని దిశాంత్‌కు తెలియజేసిన ప్రాంఛైజీ, తక్షణమే ఆసుపత్రిలో చేర్చటంతోపాటు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది. దిశాంత్‌తో రాయల్స్‌ క్రికెటర్లలో ఎవరూ కలువలేదు. దీంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రాంఛైజీ ఊపిరి పీల్చుకుంది.

ఇకపోతే... కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సుమారు ఐదు నెలలుగా క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. మార్చి ఆరంభం నుంచే క్రికెటర్లు సాధనకు దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్‌కు అధికారిక గ్రీన్‌ సిగల్‌ రావటంతో, లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ల సాధనకు అనుమతులు అడ్డుగా నిలుస్తున్నాయి. 

అన్‌లాక్‌ ప్రక్రియలో కొన్ని రాష్ట్రాలు సాధనకు అనుమతులు ఇవ్వగా, మరికొన్ని రాష్ట్రాలు పరిస్థితులకు అనుగుణంగా నిరాకరిస్తున్నాయి. వాంఖడే స్టేడియంలో వార్మప్‌తో పాటు ఇండోర్‌ స్టేడియంలో ప్రాక్టీస్‌కు అనుమతి ఇవ్వాలని స్టార్‌ క్రికెటర్‌ అజింక్య రహానె ఇటీవల ముంబయి క్రికెట్‌ సంఘానికి విజ్ఞప్తి చేశాడు. 

ముంబయిలో టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సహా రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, షార్దుల్‌ ఠాకూర్‌, పృథ్వీ షా సహా ఇతర క్రికెటర్లు నివాసం ఉంటున్నార. ఎంసీఏ నుంచి అనుమతులు లభిస్తే వీరంతా వాంఖడే, ఇండోర్‌ స్టేడియంలో సాధనకు రానున్నారు. 

క్రికెటర్ల విజ్ఞప్తితో మహరాష్ట్ర ప్రభుత్వం తలుపు తట్టిన ఎంసీఏ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. ప్రభుత్వ అనుమతులు లభిస్తే, క్రికెటర్లు స్టేడియాల్లో సాధన చేసేందుకు అవకాశం ఉంది. ఎం.ఎస్‌ ధోని సూచనల మేరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ 15 మంది భారత క్రికెటర్లతో చెపాక్‌ స్టేడియంలో ఐదు రోజుల శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. తమిళనాడు క్రికెట్‌ సంఘం (టిఎన్‌సీఏ) అనుమతుల కోసం ఎదురుచూస్తోంది.

ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి అడుగుపెట్టేందుకు బీసీసీఐ స్పష్టమైన నిబంధనలు రూపొందించింది. యుఏఈ విమానం ఎక్కడానికి ముందు 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా రావాలి. 

యుఏఈలోకి అడుగుపెట్టిన తర్వాత వారం రోజు ల క్వారంటైన్‌లో మూడుసార్లు (1,3,6 రోజు ల్లో) కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలో నెగెటి వ్‌గా రావాలి. అప్పుడే ఐపీఎల్‌ బయో సెక్యూర్‌ బబుల్‌లోకి ప్రవేశించాలి. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ (ఆర్‌సీబీ) బెంగళూర్‌లోనే వారం రోజుల క్వారంటైన్‌కు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం క్రికెటర్లను ఆగస్టు 16-17న నగరానికి రప్పించనుంది. 

ముంబయి ఇండియన్స్‌ ప్రాంఛైజీ ఇప్పటికే కోవిడ్‌19 పరీక్షల దశను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బౌలింగ్‌ కోచ్‌ జహీర్‌ ఖాన్‌లు ముంబయి ఇండియన్స్‌ ఏర్పాటు చేసిన వసతిలో టెస్టులు చేయించుకున్నట్టు సమాచారం. యుఏఈ బయల్దేరడానికి ముందు క్రికెటర్ల క్యాంప్‌, క్వారంటైన్‌పై ముంబయి ఇండియన్స్‌ నుంచి స్పష్టత లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios