Asianet News TeluguAsianet News Telugu

అనుష్క స్ట్రాంగ్ కౌంటర్... క్షమాపణలు చెప్పిన ఫరూక్‌

భారత జట్టు సెలక్షన్ కమిటీని మిక్కీమౌస్ టీమ్ గా అభివర్ణించారు. ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్నవారిలో ఒక్కరైనా కనీసం 10 నుంచి 12 టెస్టులు ఆడిన వారెవరైనా ఉన్నారా అని అన్నారు. ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో కొందరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీలు తీసుకెళ్లడం తాను చూశానని ఇంజినీర్ అన్నాడు

Farokh Engineer Apologises After Anushka Sharma's Hard-Hitting Post: Report
Author
Hyderabad, First Published Nov 1, 2019, 11:29 AM IST

మాజీ క్రికెటర్ ఫరూక్ ఇంజినీర్ దెబ్బకు దిగివచ్చారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ  భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ కి... ఫరూక్ కొంచెం వెనక్కి తగ్గారు. తాను చేసిన కామెంట్స్ కి... అనుష్క శర్మకు క్షమాపణలు తెలిపారు.

వరల్డ్‌కప్ టైమ్‌లో తాను ఒక్క మ్యాచ్‌‌కి మాత్రమే హాజరయ్యాను.. అది కూడా ఫ్యామిలీలు కూర్చునే గ్యాలరీలోనే కూర్చున్నట్లు చెప్పుకొచ్చిన అనుష్క శర్మ.. అనవసరంగా తనని వివాదాల్లోకి లాగొద్దంటూ ఫరూక్‌కి చుకలేసింది. టీ వివాదంపై భారత క్రికెట్‌లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరగడం, అనుష్క ఘాటుగా రిప్లై ఇవ్వడంతో ఫరూక్ వెంటనే క్షమాపణలు కోరాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఫరూక్ ఇంజినీర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై తీవ్ర విమర్శలు చేశారు. భారత జట్టు సెలక్షన్ కమిటీని మిక్కీమౌస్ టీమ్ గా అభివర్ణించారు. ఇప్పుడు సెలక్షన్ కమిటీలో ఉన్నవారిలో ఒక్కరైనా కనీసం 10 నుంచి 12 టెస్టులు ఆడిన వారెవరైనా ఉన్నారా అని అన్నారు. ఇప్పుడున్న సెలక్షన్ కమిటీలో కొందరు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీలు తీసుకెళ్లడం తాను చూశానని ఇంజినీర్ అన్నాడు.  భారత జట్టు సెలక్షన్ కమిటీలో దిలీప్ వెంగ్ సర్కార్ స్థాయి ఉన్న వాళ్లు ఉండాలని ఆయన పేర్కొన్నాడు

ఆయన  చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా కాగా... అనుష్క శర్మ కాస్త ఘాటుగానే స్పందించారు. ‘వారు(విమర్శలు చేసేవారు) చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే పునరావృతం అవుతూ ఉంది. అదొక నిజంలా మొత్తం ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి నేను భయపడుతున్నా. నేను ప్రతీదానికి మాట్లాడకుండా ఉంటే పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలి.’

AlsoRead మీరు ఫేమస్ అవ్వడానికి నా పేరు లాగొద్దు... ఫరూక్ పై అనుష్క శర్మ ఫైర్

‘ నా బాయ్‌ ఫ్రెండ్‌, భర్త కోహ్లి ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లి ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన కట్టుకథల్లోకి తరచు నా పేరును లాగుతున్నారు.  మీ అందరికీ నేనే దొరికానా. అసలు జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. ’

‘కోహ్లి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే నేను అక్కడికి వెళుతున్నా.  ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. అందుకే మౌనం వీడాల్సి వచ్చింది. ప్రతీ విషయంలోనూ అనవసరంగా నా పేరు లాగొద్దు. వాస్తవాలను మాట్లాడండి.. ఆధారాలతో మాట్లాడండి.. నన్ను ఇక్కడితో వదిలేయండి. మీరు ఫేమస్ అవ్వడానికి నా పేరు లాగొద్దు ’ అంటూ అనుష్క ఒక లేఖను విడుదల చేశారు. దీంతో.. ఫరూక్ వెంటనే అనుష్క శర్మకు క్షమాపణలు చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios