ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్కి షాక్ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్... మూడో టెస్టులో ఆడడం ఖాయమేనా...
భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన జో రూట్... వరుస సెంచరీలతో అదరగొడుతున్న ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్... ఇక నీ పని అయిపోయిందంటూ పరోక్షంగా కామెంట్ చేసిన అశ్విన్..
టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో బ్యాటింగ్లో ఒంటరి పోరాటం చేస్తున్నాడు జో రూట్... తొలి టెస్టులో ఓ హాఫ్ సెంచరీ, ఓ సెంచరీతో ఆదుకున్న జో రూట్... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులతో అజేయంగా నిలిచి భారీ శతకాన్ని నమోదుచేశాడు...
రెండో ఇన్నింగ్స్లోనూ 33 పరుగులు చేసి ఇంగ్లాండ్ తరుపున టాప స్కోరర్గా నిలిచాడు జో రూట్. భారత ఫాస్ట్ బౌలర్లు, మిగిలిన బ్యాట్స్మెన్ వికెట్లు ఈజీగా తీస్తున్నా జో రూట్ మాత్రం వారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. భారత ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మొదటి రెండు టెస్టుల్లోనూ బరిలో దిగకపోవడం కూడా జో రూట్కి బాగా కలిసి వచ్చింది.
లార్డ్స్ టెస్టు విజయం తర్వాత జో రూట్ను అదిరిపోయే పంచ్ ఇస్తూ, ఓ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్టు చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ‘వేర్లు (రూట్) తీసేస్తున్నాం...’ అంటూ తన ఇద్దరు కూతుర్లతో కలిసి దిగిన ఓ సెల్ఫీని పోస్టు చేశాడు. ఆ ఫోటోలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ ఎక్కడా లేకపోయినా... పరోక్షంగా ‘జో రూట్ ఇక నీ పని అయిపోయింది. నిన్ను అవుట్ చేసేస్తా...’ అంటూ ఛాలెంజ్ చేస్తున్నట్టుగా తన స్టోరీలో కాప్షన్ పెట్టాడు రవిచంద్రన్ అశ్విన్...
జో రూట్ను అత్యధికంగా ఐదు సార్లు అవుట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మొదటి రెండు టెస్టుల్లో బ్యాటింగ్లో రాణించన రవీంద్ర జడేజా... బౌలింగ్లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో మూడో టెస్టులో జడ్డూ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్కి అవకాశం దక్కవచ్చని టాక్ వినబడుతోంది...