INDvsENG 1st T20: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... రోహిత్ శర్మకు విశ్రాంతి...
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు...
రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన టీమిండియా...
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్లోని మొతేరా నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు ద్వారా ఆరంగ్రేటం చేయాలని సూర్యకుమార్ యాదవ్ ఆశపడినా,అతనికి అవకాశం దక్కలేదు.. రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన టీమిండియా, శిఖర్ ధావన్తో పాటు కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు...
భారత జట్టు:
శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, శార్దూల్ ఠాకూర్
ఇంగ్లాండ్ జట్టు:
జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, జానీ బెయిర్ స్టో, ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్, మార్క్ వుడ్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్