Asianet News TeluguAsianet News Telugu

INDvsENG: ఆడుతూ పాడుతూ కొట్టేసిన ఇంగ్లాండ్... మొదటి టీ20లో టీమిండియా చిత్తు...

49 పరుగులు చేసి అవుటైన జాసన్ రాయ్...

మొదటి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జాసన్ రాయ్, జోస్ బట్లర్...

8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్ జట్టు...

England easily Wins First T20I against Team India, jason roy misses half century CRA
Author
India, First Published Mar 12, 2021, 10:19 PM IST

టీమిండియా విధించిన 125 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని, ఇంగ్లాండ్ జట్టు ఆడుతూ పాడుతూ చేధించింది. 15.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, మొదటి టీ20లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ల్లో మొదటి మ్యాచ్ ఓడిన ఇండియా, టీ20 సిరీస్‌లోనూ ఆ ఆనవాయితీని కొనసాగించింది. జాసన్ రాయ్, జోస్ బట్లర్ కలిసి మొదటి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశారు.

24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన బట్లర్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి జాసన్, హాఫ్ సెంచరీ 1 పరుగు ముందు వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

సుందర్ వేసిన మొదటి బంతికే వికెట్ తీయడం విశేషం. డేవిడ్ మలాన్ 20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు, బెయిర్ స్టో 17 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 26 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయాన్ని పూర్తి చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios