జట్టులో పంత్ ఎందుకు ఉన్నాడు...? దినేష్ కార్తీక్ రియాక్షన్ ఇదే...!
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ లు జట్టు విజయం కోసం చాలా కృషి చేశారు. కాగా... ఫినిషింగ్ లో.. దినేష్ కార్తీక్ అదరగొట్టాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్ లో9 పరుగులు చేయాల్సిన సమయంలో.. సిక్సర్, ఫోర్ కొట్టి... విజయాన్ని అందించాడు.
టీ20 సిరీస్ లోభాగంగా ప్రస్తుతం టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయినా... రెండో మ్యాచ్ లో గెలిచింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ లు జట్టు విజయం కోసం చాలా కృషి చేశారు. కాగా... ఫినిషింగ్ లో.. దినేష్ కార్తీక్ అదరగొట్టాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్ లో9 పరుగులు చేయాల్సిన సమయంలో.. సిక్సర్, ఫోర్ కొట్టి... విజయాన్ని అందించాడు.
నిజానికి ఆ సమయంలో పంత్ బ్యాటింగ్ కి వెళ్లాల్సి ఉండగా.. కెప్టెన్ కాల్ ప్రకారం దినేష్ కార్తీక్ వెళ్లాడు. కాగా.... మ్యాచ్ విజయం తర్వాత... దినేష్ కార్తీక్ మీడియాతో మాట్లాడగా.. ఆ సమయంలో ఆయనకు ఊహించని ప్రశ్న అదిరైంది. ఆస్ట్రేలియాతో రెండో టీ20లో పంత్ జట్టులో ఎందుకు ఉన్నాడు అంటూ... విలేకరులు ఆయనను ప్రశ్నించారు. కాగా... దీనిపై దినేష్ కార్తీక్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.
‘ వర్షం కారణంగా మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో... కెప్టెన్ రోహిత్ కు ఐదుగురు బౌలర్ల ఆప్షన్ అవసరం లేకుండా పోయింది. జట్టులో నలుగురు బౌలర్లు ఉంటే చాలు.. అయితే... ఐదో బౌలర్ గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. అందుకే ఉమేశ్ యాదవ్ స్టానంలో పంత్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంకో విషయం ఏమిటంటే ఓవర్లు కుదించినప్పుడు స్పెషలిస్ట్ బ్యాటర్ అవసరం ఎక్కువగా ఉంది. అందుకే నాతో పాటు పంత్ కూడా జట్టులో ఉన్నాడు. తర్వాతి మ్యాచ్ లో ఇలానే కొనసాగుతుందా అంటే మాత్రం చెప్పలేను’’ అని దినేష్ కార్తీక్ పేర్కొన్నాడు.