India vs South Africa: వన్డే సిరీస్ కెప్టెన్‌గా భువమ, వైస్ కెప్టెన్‌గా కేశవ్ మహరాజ్... స్టార్ స్పిన్నర్ షంసీకి పిలుపు, వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ రీఎంట్రీ...

ప్రస్తుతం టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడుతున్న సౌతాఫ్రికా, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కి ఇప్పటికే భారత జట్టును ప్రకటించగా... తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో సఫారీ టీమ్‌ను నడిపించిన తెంబ భవుమా, వన్డే సిరీస్‌కి కూడా కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.

భారత సంతతి ఆటగాడు కేశవ్ మహరాజ్, ఈ వన్డే సిరీస్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. సెంచూరియన్ టెస్టు ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేసి, ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చిన మార్కో జాన్సెన్‌కి వన్డే సిరీస్‌లోనూ తొలిసారి అవకాశం దక్కింది. గాయం కారణంగా టెస్టు, వన్డే సిరీస్‌కి దూరమైన సౌతాఫ్రికా స్టార్ పేసర్ అన్రీచ్ నోకియా స్థానంలో మార్కో జాన్సెన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు...

సెంచూరియన్ టెస్టు ముగిసిన తర్వాత టెస్టు ఫార్మాట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సఫారీ సీనియర్ వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్‌కి వన్డే టీమ్‌లో చోటు దక్కింది. మొదటి టెస్టు తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా జట్టుకి దూరమైన క్వింటన్ డి కాక్, వన్డే సిరీస్ సమయానికి తిరిగి జట్టులో కలవబోతున్నాడు.

భారత జట్టుతో వన్డే సిరీస్‌కి సౌతాఫ్రికా జట్టు ఇది: తెంబ భవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్, జుబర్ హంజా, జానేమన్ మలాన్, సిసండ మగల, అయిడిన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, వేన్ పార్నెల్, అండిలే ఫెలుక్వాయో, డ్వేన్ పెటోరియస్, కగిసో రబాడా, తబ్రిజ్ షంసీ, రస్సీ వాన్ దేర్ దుస్సేన్, కేల్ వెరెన్నే

Scroll to load tweet…

రెండు రోజుల క్రితం సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కి జట్టుని ఎంపిక చేసింది భారత క్రికెట్ బోర్డు. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన రోహిత్ శర్మ, వన్డే సిరీస్ సమయానికి కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసినా... అతని గాయంపై ఇంకా క్లారిటీ రాలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మను ఎంపిక చేసి, రిస్క్ చేయడం ఇష్టం లేక... ఆల్‌ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ, ఈ సిరీస్‌కి కెఎల్ రాహుల్‌ను వన్డే కెప్టెన్‌గా ఎంచుకుంది.

యజ్వేంద్ర చాహాల్‌, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు రవిచంద్రన్ అశ్విన్... వన్డే ఫార్మాట్‌లోకి నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్నాడు... బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకేూర్, మహ్మద్ సిరాజ్‌లకు పేసర్లుగా జట్టులో చోటు దక్కగా, మహ్మద్ షమీకి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...

ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాని వన్డే సిరీస్‌కి ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా... పూర్తి ఫిట్‌నెస్ సాధించేవరకూ అతను సెలక్షన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

వన్డే సిరీస్‌కి భారత జట్టు: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహాల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్