యువరాజ్ సింగ్ రూ.16 కోట్ల రికార్డు తెరమరుగు...క్రిస్ మోరిస్ కోసం రూ.16 కోట్ల 25 లక్షలు చెల్లించిన రాజస్థాన్ రాయల్స్... 

2016లో యువరాజ్ సింగ్ రికార్డు క్రియేట్ చేసిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా క్రియేట్ చేసిన రికార్డు తెరమరుగైంది. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను ఏకంగా రూ.16 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

క్రిస్ మోరిస్‌ను వేలానికి వదిలేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వేలంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించింది. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య మొదట్లో మంచి పోటీ నెలకొంది.

అయితే ఓ స్టేజ్ దాటిన తర్వాత పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మోరిస్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు రికార్డు ధరకు అతన్ని కొనుగోలు చేసింది రాజస్థాన్. దీంతో యువరాజ్ సింగ్ రికార్డు తెరమరుగైంది.