రోహిత్ కి యూత్ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ మధ్య రోహిత్ తన ఫిట్నెస్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.

టీమిండియా వైస్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనదైన ఆట తీరుతో అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. రోహిత్ కి యూత్ చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. ఈ మధ్య రోహిత్ తన ఫిట్నెస్ పై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.

గతంలో కూడా చాలాసార్లు రోహిత్ ఫిట్నెస్ విషయంలో ట్రోలింగ్ కి గురయ్యాడు. తాజాగా మరోసారి రోహిత్‌‌పై సెటైర్లు సందిస్తున్నారు నెటిజన్లు . రోహిత్‌ మ్యాచ్‌ ఆడకపోవడానికి అసలు కారణం ఇదేనా.. తనకు ఆట కంటే వడాపావ్‌ తినడమే ముఖ్యం’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ ఈ మేరకు స్పందిస్తున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టీ20ల్లో రోహిత్‌కు విశ్రాంతినిస్తున్నట్లు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రకటించిన విషయం విదితమే.

ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ గైర్హాజరీలో మొదటి టీ20లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆదివారం నాటి రెండో మ్యాచ్‌లో అంతకు అంతా బదులు తీర్చుకుంది. మోర్గాన్‌ సేనపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌ సందర్భంగా, బెంచ్‌ మీదున్న రోహిత్‌ ఏదో తింటున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Scroll to load tweet…

సపోర్టు సిబ్బంది వెనుక కూర్చున్న రోహిత్ దాక్కొని తింటూ కనిపించాడు. చాటుగా తింటున్నట్లుగా ఉన్న ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. తోటి ఆటగాళ్లు కష్టపడుతుంటే, నువ్వేంటి ఇలా రోహిత్‌ అంటూ… కామెంట్‌ చేస్తున్నారు. అయితే, రోహిత్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. రోహిత్‌ టీంలో లేకుంటే ఆ లోటు స్పష్టంగా కనబడుతుందని కొందరు అంటున్నారు. కానీ కావాలనే ఈ స్టార్‌ ఓపెనర్‌ను తప్పించి కోహ్లి ‘గేమ్స్‌’ ఆడుతుంటే వాటిని పక్కనపెట్టి ఇలా తిండి గురించి కామెంట్‌ చేయడం ఏమిటని మండిపడుతున్నారు.