Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టులో అజారుద్దీన్‌కు చుక్కెదురు.. హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌గా దిగి పోవాల్సిందే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) (hyderabad cricket association) విషయంలో అజారుద్దీన్‌కు (mohammed azharuddeen) సుప్రీంకోర్టులో (supreme court) చుక్కెదురైంది. అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది

big shock to azharuddin in supreme court over hyderabad cricket association president post
Author
Hyderabad, First Published Oct 21, 2021, 4:37 PM IST

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) (hyderabad cricket association) విషయంలో అజారుద్దీన్‌కు (mohammed azharuddeen) సుప్రీంకోర్టులో (supreme court) చుక్కెదురైంది. అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సిందేనని సుప్రీం స్పష్టం చేసింది. కొన్ని నెలల క్రితం అజార్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పిస్తూ అపెక్స్ కౌన్సిల్ (apex council) నిర్ణయం తీసుకుంది. దీంతో అంబుడ్స్‌మన్ దీపక్ వర్మతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించారు అజారుద్దీన్. ఈ సందర్భంగా అపెక్స్ కౌన్సిల్ తరపు న్యాయవాది మరియు అజారుద్దీన్ తరపు న్యాయవాది వాదించిన వాదనలను విన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హెచ్ సి ఎ ప్రెసిడెంట్ పదవి నుంచి అజారుద్దీన్ తొలగిపోవాల్సిందేనని పేర్కొన్న సుప్రీంకోర్టు… దీపక్ వర్మ (deepak varma) వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో అపెక్స్ కౌన్సిల్ కు భారీ ఊరట లభించింది.

హెచ్‌సీఏ (hca) నియమ నిబంధనలను అతిక్రమిస్తున్నారంటూ, అవినీతికి పాల్పడ్డారంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై ఆరోపణలు రావడంతో జూన్ 17న ఆయన్ని ఆ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అపెక్స్ కౌన్సిల్. కొద్దిరోజుల క్రితం జస్టిస్ దీపక్ వర్మ నేతృత్వంలోని కమిటీ... దీనిపై విచారణ జరిపి, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ‘అపెక్స్ కౌన్సిల్ తమ సొంతంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. సరైన పద్దతిలో ఎన్నుకోబడిన ప్రెసిడెంట్ అజారుద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తున్నా. వారు పంపిన షోకాజ్ నోటీసులు, ఇతరత్రా ఆదేశాలు కానీ చెల్లుబాటు కావు’ అంటూ తెలియచేశారు. 

ALso Read:అజారుద్దీన్ కు హైకోర్టులో చుక్కెదురు: హెచ్‌సీఏ కౌన్సిల్ రద్దుపై స్టే

హెచ్‌సీఏ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను తిరిగి నియమిస్తున్నట్టు ప్రకటించిన అంబుడ్సమన్, రిటైర్డ్ జడ్జ్ దీపక్ వర్మ, ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె జాన్ మనోజ్, ఆర్ విజయానంద్, నరేశ్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధలపై తాత్కాలికంగా అనర్హత వేటు విధించారు. అయితే అంబుడ్స్‌మెన్  నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వైరి వర్గం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై జూలై 7న తెలంగాణ హైకోర్టు (telangana high court) విచారణ నిర్వహించింది. ఈ విచారణలో అంబుడ్స్ మెన్ ప్రకటనపై స్టే విధించింది హైకోర్టు.


 

Follow Us:
Download App:
  • android
  • ios