మీ త్యాగాలను ఎప్పుడూ మరచిపోము అని కూడా అనడం విశేషం. మీ స్నేహం, నమ్మకం, నిబద్ధతకు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేసింది.
ఆస్ట్రేలియా పర్యటనను భారత్ దిగ్విజయంగా పూర్తి చేసింది. చివరగా టెస్టు సిరీస్ లో విజయం సాధించి.. అందరినీ ఆనందంలో ముంచెత్తారు. కాగా.. ఆస్ట్రేలియా టూర్ను విజయవంతంగా ముగించిన ఇండియన్ టీమ్కు కృతజ్ఞతలు తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ మేరకు బీసీసీఐకి ఓ లేఖ రాసి ట్విటర్లో పోస్ట్ చేసింది.
కరోనా మహమ్మారి విజృంభించిన వేళ.. ఎన్నో సవాళ్ల మధ్య కూడా బీసీసీఐలోని మా మిత్రుల వల్లే ఈ టూర్ విజయవంతమైందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రశంసించింది. మీ త్యాగాలను ఎప్పుడూ మరచిపోము అని కూడా అనడం విశేషం. మీ స్నేహం, నమ్మకం, నిబద్ధతకు ఆస్ట్రేలియన్ క్రికెట్ ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ సిరీస్ ప్రపంచంలోని ఎన్నో కోట్ల మందిలో ఆనందం నింపిందని ఆ లేఖలో క్రికెట్ ఆస్ట్రేలియా చెప్పింది. టూర్లో భాగంగా వన్డే సిరీస్ను ఆస్ట్రేలియా గెలవగా.. టీ20, టెస్ట్ సిరీస్లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. ఈ టూర్లో ఇండియన్ టీమ్ చూపించిన ధైర్యం, లాఘవం, నైపుణ్యానికి క్రికెట్ ఆస్ట్రేలియాలోని ప్రతి ఒక్కరి తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొంది
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 20, 2021, 2:25 PM IST