ఢిల్లీ క్యాపిటల్ బౌలర్ అన్‌రిచ్‌ నోర్ట్జేకు ఐపీఎల్ లో చేదు అనుభవం ఎదురయ్యింది. మ్యాచ్ పూర్తయ్యేవరకు బౌలింగ్ వేయకుండా అంపైర్లు అతన్ని అడ్డుకున్నారు. వరుసగా రెండు బీమర్లు వేయడమే దీనికి కారణం. 

ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్ బౌలర్ అన్‌రిచ్‌ నోర్ట్జేకు చేదు అనుభవం ఎదురయింది. తన వరుస ఓవర్లలో రెండు బీమర్లు (హై ఫుల్ టాస్ బంతి) వేయడంతో అంపైర్లు నోర్జ్టే బౌలింగ్ వేయకుండా అడ్డుకున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్లో బౌలర్ రెండు బీమర్లు వేస్తే మ్యాచ్ పూర్తయ్యే వరకు సదరు బౌలర్ కు మళ్ళీ బౌలింగ్ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా నోర్జ్టే ఈ విషయంలో అదే జరిగింది.

ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతిని నోర్జ్టే డికాక్ కు బీమర్ వేశాడు. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతిని డికాక్ కళ్ళు చెదిరే సిక్స్ కొట్టాడు. అంపైర్ బీమర్ అని వార్నింగ్ ఇచ్చి నో బాల్ గా పరిగణించారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన నోర్జ్టే… ఆ ఓవర్ మూడో బంతిని మరోసారి బీమర్ వేశాడు. దీపక్ హుడాకు చాలా ఎత్తులో వెళ్ళిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా ఆడాడు. హుడా సింగిల్ కంప్లీట్ చేయగా.. అంపైర్లు దానిని భీమర్ గా పరిగణించి నోర్జ్టేను బౌలింగ్ చేయకుండా అడ్డుకున్నారు.

దీంతో మిగిలిన నాలుగు బంతులను కుల్దీప్ యాదవ్ వేశాడు. నోర్జ్టేకు ఒకరకంగా బ్యాడ్ లక్ అనే చెప్పవచ్చు. ఇక నోర్జ్టేకు భారత గడ్డపై ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. 2020 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న నోర్జ్టే ఆ సీజన్ మొత్తం యూఏఈలోనే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్లో టీమ్ ఇండియాలో జరిగిన తొలి అంచె పోటీలకు దూరమైన నోర్జ్టే.. యూఏఈ వేదికగా జరిగిన రెండో అంచె పోటీల్లో పాల్గొన్నాడు. అలా రెండు సీజన్ల పాటు విదేశాల్లోనే ఆడి.. మూడో సీజన్ ద్వారా భారత్ గడ్డపై ఆడుతున్న తొలి క్రికెటర్ గా నోర్జ్టే చరిత్ర సృష్టించాడు.