Asianet News TeluguAsianet News Telugu

డాక్టర్ దంపతులకు కరోనా: తెలంగాణలో 44కు చేరిన పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది.

Three more coronavirus cases in Telanagana: Count reaches to 44
Author
Hyderabad, First Published Mar 26, 2020, 2:06 PM IST

హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44కు చేరుకుంది. తాజాగా కరోనా వైరస్ సోకినవారిలో ఇద్దరు డాక్టర్లున్నారు. వారు భార్యాభర్తలు. హైదరాబాదులోని దోమలగుడా ప్రాంతానికి చెందినవారు. వైద్య ఆరోగ్య శాఖ ఆ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ డాక్టర్లు ఎవరెవరిని కలిశారనే విషయాన్ని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. డాక్టర్లకు కరోనా వైరస్ పాజిటివ్ రావడం తెలంగాణలో ఇదే మొదటిసారి. 

భర్తకు 44 ఏళ్లు కాగా, భార్యకు 43 ఏళ్లు ఉంటాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారిని సంబంధిత ఆస్పత్రిలో చేర్చామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ చెప్పింది.మేడ్చెల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. అతను ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అతన్ని సంబంధిత ఆస్పత్రిలో చేర్చారు.

తెలంగాణలో బుధవారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ముూడేళ్ల బాలుడికి, ఓ మహిళకు బుధవారం కోవిడ్ 19 నిర్దారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 41కి చేరుకుంది. 

హైదరాబాదులోని గోల్కొడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. బాలుడికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఆస్పత్రిలో చేర్చారు. వారికి గురువారం పరీక్షలు చేస్తారు. 

కొద్ది రోజుల క్రితం లండన్ నుంచి హైదరాబాదు వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెెందిన వ్యక్తి (49)కి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు (43) వైరస్ సోకినట్లు బుధవారం తేలింది. ఈమెతో కలిపి రాష్టర్ంలో ఇప్పటి వరకు రెండో దశ వైరస్ వ్యాప్తిలో ఆరు కేసులు నమోదయ్యాయి.

వారిలో ముగ్గురు మహిళలు. మొత్తం 40 మంది హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం డీఎస్పీ నిర్వాకం వల్ల ముగ్గురు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. డీఎస్పీకి, ఆయన కుమారుడికి, ఆయన ఇంటి పనిమనిషికి కరోనా నిర్ధారణ అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios