Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ జిల్లాను వణికిస్తున్న కరోనా: 27 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కరోనా వైరస్ వణికిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 27 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిజామాబాద్ నగరంలోనే 17 కేసులు నమోదయ్యాయి.

Coronavirus: 27 positive cases recorded in Nizamabad district
Author
Nizamabad, First Published Apr 6, 2020, 10:20 AM IST

నిజామాబాద్: తెలంగాణలోని నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వణికిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ నగరంలోనే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

కామారెడ్డిలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 43 మందికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పరీక్షలకు పంపించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. బాన్సువాడలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోద్యయాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు 334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. మర్కజ్ కు వెళ్లి వచ్చిన 297 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. ఆస్పత్రుల్లో 289 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

 తెలంగాణలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా, 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వారిని సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లోని ఎంజీఎం నుంచి వారిని గాంధీకి తరలించారు. ఎంజీఎంలో చికిత్స అందించిన నలుగురు పీజీ విద్యార్థులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. వారి శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు.  

వరంగల్ లో ఢిల్లీ వెళ్లని ఓ వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios