Asianet News TeluguAsianet News Telugu

బిఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..

చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 1 లోపు కొనుగోలు చేసిన డీజిల్ వాహనాలను ప్రజా సేవలకు ఉపయోగించాలని, అలాగే వాటిని బిఎస్-4 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని, ఏప్రిల్ 1 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలను బిఎస్-6 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.

Supreme Court Allows Registration Of BS4 Diesel Vehicle Purchased Before April 1
Author
Hyderabad, First Published Sep 19, 2020, 2:22 PM IST

ఏప్రిల్ 1 ముందు కొనుగోలు చేసిన బిఎస్-ఐవి డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. మునిసిపల్ కార్పొరేషన్లు, ఢీల్లీ పోలీసులకు అవసరమైన పబ్లిక్ సర్వీసెస్, పబ్లిక్ యుటిలిటీ సేవలలో ఉపయోగించే వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ కు అనుమతి ఇచ్చింది.

చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 1 లోపు కొనుగోలు చేసిన డీజిల్ వాహనాలను ప్రజా సేవలకు ఉపయోగించాలని, అలాగే వాటిని బిఎస్-4 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని, ఏప్రిల్ 1 తర్వాత కొనుగోలు చేసిన వాహనాలను బిఎస్-6 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించింది.

అన్ని నియమ నిబంధనలకు లోబడి సిఎన్‌జి వాహనాల నమోదుకు కూడా ధర్మాసనం అనుమతించింది. సిఎన్‌జి, బిఎస్‌-4, బిఎస్‌-6 వంటి మూడు రకాల వాహనాల రిజిస్ట్రేషన్ కోసం బెంచ్‌ ముందు దరఖాస్తులు దాఖలు చేసినట్లు సుప్రీంకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

ఏప్రిల్ 1 లోపు మున్సిపల్ కార్పొరేషన్లు కొనుగోలు చేసిన బిఎస్-4 డీజిల్ వాహనాలు చెత్త ఎత్తడం, పబ్లిక్ యుటిలిటీస్ వంటి అవసరమైన సేవలకు ఉపయోగించే వాటిని బిఎస్-4 నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయబడతాయి.

also read గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి పేటీఎం యాప్‌ ఔట్.. కారణం ? ...

అంతకుముందు మార్చిలో బిఎస్-4 వాహనాల అమ్మకం, రిజిస్ట్రేషన్‌ గడువు ఒక నెల పాటు పొడిగించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) దరఖాస్తు చేసింది.

కోవిడ్-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు కోల్పోయిన కారణంతో ఎఫ్‌ఏ‌డి‌ఏ, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేటప్పుడు బిఎస్-4 వాహనాల అమ్మకాలకు మార్చి 31 గడువును పొడిగించాలని కోరింది.

మార్చిలో, బిఎస్-4 వాహనాల అమ్ముడుపోని స్టాక్ను క్లియర్ చేయడానికి మార్చి 31 గడువును బెంచ్ సడలించింది. కోవిడ్-19  కారణంగా లాక్ డౌన్ ముగిసిన 10 రోజుల్లో అమ్ముడుపోని  బిఎస్-4 వాహనాల్లో 10 శాతం విక్రయించడానికి అనుమతించింది.

ఈ అభివృద్ధి ఎందుకంటే ఏప్రిల్ 1 నుండి భారతదేశం ప్రపంచంలోని పరిశుభ్రమైన ఉద్గార ప్రమాణాలకు మారాలని నిర్ణయించుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios