Asianet News TeluguAsianet News Telugu

మారుతి సుజుకి నుండి కొత్త హైబ్రిడ్ కారు లాంచ్

మారుతి సుజుకి ఇప్పుడు కొత్త హైబ్రిడ్ వెర్షన్ విటారా బ్రెజ్జా కారును ఆవిష్కరించింది. అయితే ఈ కారును ప్రస్తుతం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేయనున్నారు. తరువాత తేదీలో డీజిల్ పవర్‌ట్రెయిన్ వెర్షన్ పై సమాచారం లేదు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పెట్రోల్ హైబ్రిడ్‌ కారును ఆటో ఎక్స్‌పో 2020లో భారతదేశంలో ఆవిష్కరించారు.

new maruti suzuki vitara brezza  petrol hybrid unveiled in auto expo 2020
Author
Hyderabad, First Published Feb 6, 2020, 3:48 PM IST

ఆటొమొబైల్ దిగ్గజ, కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి  ఇప్పుడు కొత్త  హైబ్రిడ్ వెర్షన్ విటారా బ్రెజ్జా కారును ఆవిష్కరించింది. అయితే ఈ కారును ప్రస్తుతం 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేయనున్నారు. తరువాత తేదీలో డీజిల్ పవర్‌ట్రెయిన్ వెర్షన్ పై సమాచారం లేదు. మారుతి సుజుకి విటారా బ్రెజ్జా పెట్రోల్ హైబ్రిడ్‌ కారును ఆటో ఎక్స్‌పో 2020లో భారతదేశంలో ఆవిష్కరించారు.

also read  ఆటో ఎక్స్ పోలో కార్ల కంపెనీల జోష్‌ ....యాంకర్ల రాకతో

విటారా బ్రెజ్జా పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. మారుతి సుజుకి ఎస్‌హెచ్‌విఎస్ హైబ్రిడ్ రేంజ్‌లో చేరిన తాజా లేటెస్ట్ మోడల్ ఇదీ.హుడ్ కింద ఉన్న మోటారు బిఎస్ 6 కంప్లైంట్ 1.5-లీటర్ ఇంజన్, నాలుగు సిలిండర్, కె 15 పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారుతో 6000 ఆర్‌పిఎమ్ వద్ద 102 బిహెచ్‌పి, పీక్ టార్క్ 4400 ఆర్‌పిఎమ్ వద్ద 134 ఎన్‌ఎమ్‌ను విడుదల చేస్తుంది.

new maruti suzuki vitara brezza  petrol hybrid unveiled in auto expo 2020

ఈ మోటారు  మొదటిగా సియాజ్‌లో, తరువాత కొత్త ఎర్టిగాలో కూడా ప్రవేశించింది. ఇతర మోడళ్ల మాదిరిగానే విటారా బ్రెజ్జాలో కూడా ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. మెకానికల్ అప్‌గ్రేడ్ కాకుండా దాని రూపంలో కూడా చిన్న మార్పులు ఉన్నాయి. 2020 విటారా బ్రెజ్జాకు కొత్త క్రోమ్ గ్రిల్ ముందు లభిస్తుంది.  

also read హ్యుండాయ్ మోటర్స్ నుండి కొత్త మోడల్ స్పోర్ట్స్ కారు....

హెడ్‌ల్యాంప్‌లు కొంచెం కొత్తగా, ఎల్‌ఈ‌డి డే టైమ్ రన్నింగ్ లైట్లు (డి‌ఆర్‌ఎల్ లు), ఎల్‌ఈ‌డి ప్రొజెక్టర్ లైట్స్ అప్ డేట్ చేశారు. కొత్తగా 16-అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈ‌డి టెయిల్ లాంప్స్ ఉన్నాయి. కొత్త మోడల్ క్యాబిన్ రివైజ్డ్ అప్హోల్స్టరీతో పాటు కొత్త అప్ డేట్స్ ఉన్నాయి. మారుతి సరికొత్త 2.0 స్మార్ట్ ప్లే స్టూడియో, 7.0-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంది.

ప్రస్తుతానికి విటారా బ్రెజ్జా హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లాంచ్ చేశారు. తరువాత తేదీలో డీజిల్ పవర్‌ట్రెయిన్ ఇంజన్ కార్ల గురించి ఎటువంటి సమాచారం లేదు. మారుతి చైర్మన్ ఆర్.సి. భార్గవ మాట్లాడుతూ బిఎస్ 6 దేశవ్యాప్తంగా అమలు చేసిన తర్వాత డీజిల్ మోడళ్లకు తగినంత డిమాండ్ ఉంటే మారుతి సుజుకి కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించడాన్ని మాత్రమే పరిశీలిస్తామని చెప్పారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios