Asianet News TeluguAsianet News Telugu

పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు... కారణం ఏంటంటే...?

ఇందులో 6,000 ఎలక్ట్రిక్ కార్లు, 4,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. జూలై 2019లో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య 9,303, ఇందులో 5,573 ఎలక్ట్రిక్ కార్లు, 3,690 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 40 ఆర్టీసీ ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. 

Electric vehicle sales at top gear in Telangana: , record 23% rise in 2020
Author
Hyderabad, First Published Aug 11, 2020, 3:20 PM IST

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు గత ఏడాదికాతో పోలిస్తే 2020 సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో 23% పెరిగాయి. రీజినల్ ట్రాన్సుపోర్ట్ అథారిటీ (ఆర్‌టిఏ) వద్ద లభించిన సమాచారం ప్రకారం ఆగస్టు 6 నాటికి తెలంగాణలో 11వేల బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్ల పై పరుగులు పెడుతున్నాయి.

ఇందులో 6,000 ఎలక్ట్రిక్ కార్లు, 4,000 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. జూలై 2019లో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల సంఖ్య 9,303, ఇందులో 5,573 ఎలక్ట్రిక్ కార్లు, 3,690 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 40 ఆర్టీసీ ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి.

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జిఎస్‌టి) తగ్గింపు, అలాగే  తక్కువ మెంటేనెన్స్ ఖర్చుల వల్ల మెరుగైన స్థోమత వంటి అంశాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కారణమని పరిశ్రమ నిపుణులు పేర్కొన్నారు.

గత ఏడాది ఏప్రిల్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేట్లను 12% నుంచి 5% శాతానికి తగ్గించడం ప్రధాన కారణాల్లో ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి రాయితీలు, మెంటేనెన్స్ ఖర్చులు, డీజిల్ లేదా పెట్రోల్ వేరియంట్ల వాహనాలకు బదులు  ఎలక్ట్రిక్ వాహనాలను ఎన్నుకోవటానికి ప్రజలను ప్రోత్సహించే కొన్ని ముఖ్యమైన అంశాలు ”అని ఇటిఓ మోటార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిజు మాథ్యూస్ అన్నారు.

also read కే‌టి‌ఎం, కవాసకి బైకులకి పోటీగా ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైక్ లాంచ్.. ధర ఎంతంటే ?

"ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల పెరుగుదల వల్ల గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నాము," అని మాథ్యూస్ చెప్పారు.

ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎక్కువ మందిని ఎలక్ట్రిక్ వాహనాలను ఎన్నుకునేలా చేస్తుంది అని నిపుణులు తెలిపారు. ప్రభుత్వం కొత్త తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీని ఆమోదించింది.

వాహన కొనుగోలుదారులు, తయారీదారులకు వివిధ ప్రోత్సాహకాల ద్వారా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. "గత సంవత్సరంతో పోలిస్తే రోడ్లపై ప్రయాణించే ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది.

ఇది సాధారణ వృద్ధి అయినప్పటికీ, పెరుగుదలను అర్థం చేసుకోవడానికి దాని వెనుక గల కారణాలను అధ్యయనం చేయాలి ”అని ఉమ్మడి రవాణా కమిషనర్ సి రమేష్ అన్నారు. 100% రోడ్ టాక్స్ మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి ప్రోత్సాహకాలు ఎలక్ట్రిక్ వాహనాలను ఎన్నుకోవటానికి ఎక్కువ మందిని ప్రోత్సహిస్తాయని అధికారులు నమ్మకంగా ఉన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios