డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నేషనల్ EMF పోర్టల్ ప్రకారం, ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ జియో తన స్వంత 700 MHz, 3,500 MHz ఫ్రీక్వెన్సీలలో 99,897 BTSని ఇన్‌స్టాల్ చేసింది.

బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో అల్ట్రా-హై స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడానికి దేశవ్యాప్తంగా 1 లక్ష టవర్లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన 5G టెలికాం నెట్‌వర్క్‌ను ప్రారంభించేందుకు Jio ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ సంఖ్య దాని సమీప ప్రత్యర్థుల కంటే 5 రెట్లు ఎక్కువ అని తెలిపింది. భారతి ఎయిర్‌టెల్ 22,219 BTSతో పోలిస్తే Jioకి 99,897 BTS (బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్లు) ఉన్నట్లు టెలికాం శాఖ (DoT) నేషనల్ EMF పోర్టల్ ఇటీవలి నివేదిక చూపుతోంది. మరిన్ని టవర్లు సెల్ సైట్‌లు అంటే వేగవంతమైన వేగం, ఇది వినియోగదారులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

భారత్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ 115 శాతం పెరిగింది

నెట్‌వర్క్ ఇంటెలిజెన్స్ కనెక్టివిటీలో గ్లోబల్ లీడర్ ఓక్లా సంస్థ ఫిబ్రవరి 28 నాటి నివేదిక ప్రకారం, Airtel 268 Mbpsతో పోలిస్తే Jio టాప్ మీడియన్ స్పీడ్ 506 Mbps (సెకనుకు మెగాబైట్లు)గా పేర్కొంది. 5G టాప్ స్పీడు ర్యాంకింగ్స్ లో నాలుగు నెలలకు పైగా జియో నెంబర్ వన్ పొజీషన్ లో ఉంది. ఇప్పటికే దేశంలోని మొబైల్ ల్యాండ్‌స్కేప్‌పై జియో విపరీతమైన ప్రభావాన్ని చూపుతోంది అని ఓక్లా నివేదికలో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 2022లో 13.87 Mbps సగటు డౌన్‌లోడ్ వేగం ఉంటే, 2023 జనవరిలో 29.85 Mbpsకి 5G లాంచ్ కంటే ముందు భారతదేశం అంతటా సగటు డౌన్‌లోడ్ వేగం 115 శాతం పెరిగిందని స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ డేటా చూపిస్తుంది.

జనవరి 2023లో కోల్‌కతాలో జియో 500 Mbps కంటే ఎక్కువ వేగవంతమైన సగటు 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించగా, చాలా టెలికాం సర్కిల్‌లలో ప్రారంభ 5G అడాప్టర్‌లలో 5G పనితీరు పెరిగింది. Jio కోల్‌కతాలో 506.25 Mbps టాప్ యావరేజ్ 5G డౌన్‌లోడ్ స్పీడ్‌ ఎక్స్ పీరియన్స్ అవగా, ఎయిర్‌టెల్ ఢిల్లీలో 268.89 Mbps సాధించింది.

మరోవైపు ఇప్పటికే భారతదేశం లో అర బిలియన్ ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది, ఇది చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. 5G టెలికాం సేవలు అక్టోబర్ 2022లో ప్రారంభించగా, విప్లవాత్మకంగా ఈ సేవలు దేశ మంతటా విస్తరిస్తున్నాయి. .

మరో 235 నగరాల్లో Airtel అల్ట్రా-ఫాస్ట్ 5G సర్వీసు

గత నెల, రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పోస్ట్ బడ్జెట్ వెబ్‌నార్‌లో భారతదేశపు అతిపెద్ద టెల్కో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5G రోల్‌అవుట్‌ సాధించినట్లు తెలిపింది. 

దేశంలోని 500 నగరాల్లోని వినియోగదారులకు తమ అల్ట్రా-ఫాస్ట్ 5G సేవ అందుబాటులో ఉందని భారతీ ఎయిర్‌టెల్ శుక్రవారం తెలిపింది. Airtel తన నెట్‌వర్క్‌కు 235 నగరాలను జోడించింది, ఇది ఇప్పటివరకు అతిపెద్ద రోల్‌అవుట్‌లలో ఒకటిగా నిలిచింది.