మోర్టగేజ్‌ లెండింగ్‌ కంపెనీ బెటర్‌ డాట్‌ కామ్‌ అమెరికా కేంద్రంగా  కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌ ఆర్ధికంగా ఆదుకుంటుంది. బెటర్‌ డాట్‌ కామ్‌ సంస్థ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1.5 బిలియన్ల నిధుల్ని సేకరించారు. 

బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గార్గ్ ఈ మధ్యన తరచూ వార్తల్లోకెక్కుతున్నారు. డిసెంబర్ 2021లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసేసిన విశాల్ గార్గ్ అలాంటి నిర్ణయమే మరొకటి తీసుకుని మళ్లీ చర్చనీయాంశంగా మారారు. వాలంటరీగా కంపెనీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని ఉద్యోగులకు ఆఫర్ చేశారు. అంతేకాక ఇప్పటికే 920 మంది ఉద్యోగుల రాజీనామాల లేఖలకు ఆమోదం కూడా తెలిపారు. గతేడాది క్రిస్టమస్‌కి ముందు మూడు నిమిషాల జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగించి, ప్రధాన వార్తాంశంగా నిలిచారు. మార్చిలో కూడా కంపెనీ అమెరికా, భారత్‌లో పనిచేసే 4 వేల మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో గర్భిణీలు కూడా ఉన్నారు. వీరికి సెవరెన్స్ లేదా వాలంటరీ సెపరేషన్‌ను చెల్లించింది. అంతేకాక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్‌ను అందించింది.

మోర్టగేజ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఇండస్ట్రీలో చాలా కంపెనీలకు సవాళ్లతో కూడిన వాతావరణాన్ని క్రియేట్ చేశాయని కంపెనీ చెప్పింది. వాలంటరీ సెపరేషన్ అగ్రిమెంట్ కింద కంపెనీని వైదొలిగే అవకాశం భారత్‌లోని ఉద్యోగులకు బెటర్ డాట్ కామ్ కంపెనీ కల్పిస్తున్నట్టు ఓ న్యూస్ ఏజెన్సీ రిపోర్టు చేసింది.

సాఫ్ట్‌బ్యాంకు అందిస్తోన్న 1.5 బిలియన్ డాలర్ల నగదుకు.. స్వయంగా విశాల్ గార్గ్‌నే 750 మిలియన్ డాలర్లకు గ్యారెంటీగా ఉన్నారు. ఏదైనా నష్టం ఏర్పడితే జపనీస్ పెట్టుబడి కంపెనీకి నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ బాధ్యత తీసుకోకపోవడంతో ఆ బాధ్యతను గార్గ్ తీసుకున్నారు. బెటర్ డాట్ కామ్‌కు ఫైనాన్స్ అందించే అరోరా అక్విజిషన్ గ్రూప్, సాఫ్ట్‌ బ్యాంకులు తమ టర్మ్స్‌ను మార్చుకున్నాయని కంపెనీ చెప్పింది. డీల్ ముగిసే వరకు వేచి చూడకుండా.. వెంటనే 1.5 బిలియన్ డాలర్లు అందించేందుకు ఒప్పుకున్నట్టు పేర్కొంది. వాటిలో 750 మిలియన్ డాలర్లకు వ్యక్తిగతంగా తాను బాధ్యత తీసుకుంటున్నట్టు గార్గ్ తెలిపారు. ఇదే విషయాన్ని తాను ఉద్యోగులకు పంపిన ఈమెయిల్‌లో వెల్లడించారు.

గతేడాది నవంబర్‌లో అరోరా అక్విజిషన్ కార్ప్ సంస్థను బెటర్‌.కామ్‌ 1.5బిలియన్‌లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా సాఫ్ట్‌ బ్యాక్‌ ఇచ్చే రుణం కోసం ఎదురు చూడకుండా అరోరా అక్విజిషన్‌ కార్ప్‌కు సగం చెల్లించి ఈ కొనుగోళ్ల డీల్‌ను క‍్లోజ్‌ గార్గ్‌ క్లోజ్‌ చేశారు. ఈ సందర్భంగా అరోరా ప్రతినిధులు మాట్లాడుతూ.. బెటర్‌ సంస్థ ఫౌండర్‌, అధినేత విశాల్‌ గార్గ్‌ సాఫ్ట్‌ బ్యాంక్‌కు రుణాల్ని ఇచ్చేలా వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ రుణాల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. 

కాబట్టి స్వచ్ఛంగా సంస్థ నుంచి స్వచ్చందంగా వెళ్లి పోవాలనుకున్న 920మంది భారతీయ ఉద్యోగులు రాజీనామాల్ని అంగీకరించారు. ఈ క్రమంలో సాఫ్ట్‌ బ్యాంక్‌కు 750 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇక నాదగ్గర ఏమీలేదు. ఇది నిజం. నేను వ్యక్తిగతంగా మూడు వంతుల బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చాను. దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాను. "అని ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈవో పేర్కొన్నారు.