Asianet News TeluguAsianet News Telugu

మార్చి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ట్రావెల్ పేమెంట్, ఫెస్టివల్ అడ్వాన్స్ : కేంద్ర మంత్రి

దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందే డిమాండ్‌ను ఉత్తేజపరిచేందుకు, వినియోగదారుల వ్యయాన్ని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ట్రావెల్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్, ప్రత్యేక పండుగ పథకాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.
 

Travel Payout, Festival Advance For Government Employees till March: finance minister-sak
Author
Hyderabad, First Published Oct 12, 2020, 2:19 PM IST

రాబోయే దసరా, దీపావళి పండుగ సీజన్‌కు ముందే డిమాండ్‌ను ఉత్తేజపరిచేందుకు, వినియోగదారుల వ్యయాన్ని పెంచే ప్రయత్నంలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ట్రావెల్ (ఎల్‌టిసి) క్యాష్ వోచర్, ప్రత్యేక పండుగ పథకాలను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

"ప్రభుత్వా, ప్రభుత్వారంగ ఉద్యోగుల పొదుపులు పెరిగాయని, తక్కువ వేతన ఉద్యోగుల ప్రయోజనం కోసం డిమాండ్ పెంచడానికి, వారిని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాము" అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

also read ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఎలా.. ? కావల్సిన సర్టిఫికేట్ ఏంటి.. ...

ఎల్‌టిసి క్యాష్ వోచర్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు కనీసం 12 శాతం జీఎస్టీ వస్తువులను కొనుగోలు చేయడానికి ఎన్‌కాష్మెంట్ 3 రెట్లు టికెట్ ఛార్జీలను పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాలను ఎంచుకుంటే, దీనికి సుమారు 5,675 కోట్లు ఖర్చవుతాయి.

పిఎస్‌బి, పిఎస్‌యు ఉద్యోగులు కూడా ఈ సదుపాయాన్ని పొందటానికి అర్హులు, వారికి 1,900 కోట్లు ఖర్చు అవుతుంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ ఇన్ఫ్యూషన్ సుమారు 19,000 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్‌ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏప్రిల్-జూన్ కాలంలో దేశ జిడిపి లేదా జాతీయోత్పత్తి రికార్డు స్థాయిలో 23.9 శాతం కుదుర్చుకున్న తరుణంలో ఆర్థిక మంత్రితో విలేకరుల సమావేశం జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios