Asianet News TeluguAsianet News Telugu

టన్నుల కొద్దీ బంగారం, వెండి, రత్నాలతో మునిగిపోయిన ఓడ ! జాతీయ మిషన్‌గా రాష్ట్రపతి ప్రకటన..

నివేదికల ప్రకారం, కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అతని పదవీకాలం 2026లో ముగుస్తుంది, అతని పదవీకాలం ముగిసేలోపు ఈ నిధిని స్వాధీనం చేసుకోవాలని దేశం యోచిస్తోంది. 
 

Tons of gold, silver and emeralds found in sunken ship! Beat to sink!-sak
Author
First Published Nov 9, 2023, 6:13 PM IST

17వ శతాబ్దానికి చెందిన మునిగిపోయిన షిప్ ని కొలంబియా వెలికితీయనుంది. ఈ షిప్ లో కోట్ల విలువ చేసే  200 టన్నుల బంగారం, వెండి ఇంకా  రత్నాలు  ఉన్నాయని నమ్ముతారు. కొలంబియా నీటి అడుగున ఉన్న ఈ నిధులను తిరిగి పొందేందుకు జాతీయ మిషన్‌గా  ప్రకటించింది. 

నివేదికల ప్రకారం, కొలంబియా ప్రస్తుత అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ విషయాన్ని ప్రకటించారు. అతని పదవీకాలం 2026లో ముగుస్తుంది, అతని పదవీకాలం ముగిసేలోపు ఈ నిధిని స్వాధీనం చేసుకోవాలని దేశం యోచిస్తోంది. 

1708లో కొలంబియాలోని కార్టజేనా ఓడరేవులో మునిగిపోయిన షిప్  స్పెయిన్‌కు చెందినదని డైలీ మెయిల్ పేర్కొంది. ఈ షిప్ ను  బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపయోగించారు. అయితే ఈ ఓడ పేలి మునిగిపోయింది. 1708లో పనామాలోని పోర్టోబెల్లో నుండి 14 వ్యాపార నౌకలు, మూడు స్పానిష్ యుద్ధనౌకలు ప్రయాణించాయి. కానీ అది బారు చేరుకున్నప్పుడు బ్రిటిష్ స్క్వాడ్రన్‌ను ఎదుర్కొంది. ఆ సమయంలో స్పెయిన్‌లో వారసత్వ హక్కుపై స్పెయిన్ ఇంకా బ్రిటన్ మధ్య యుద్ధం జరిగింది. స్పానిష్ ఓడ కనిపించిన వెంటనే, బ్రిటీష్ వారు దాడిని ప్రారంభించారు, ఇలా స్పానిష్ ఓడను తగలబెట్టి  ముంచినట్లు  నివేదించబడింది. 

నేటికి ఈ నిధి విలువ 20 బిలియన్ డాలర్లు. షిప్‌రెక్స్‌ని 'హోలీ గ్రెయిల్ ఆఫ్ షిప్‌రెక్స్' అంటారు. మునిగిపోయిన ఓడ 2015లో కనుగొనబడింది. కొలంబియా నేవీకి చెందిన డైవర్ల బృందం 3100 అడుగుల లోతులో ఈ నౌకను కనుగొంది. 2022లో కూడా ఓ బృందం ఓడ దగ్గరికి వెళ్లి అందులోని నిధిని ఫోటో తీశారు.

కొలంబియా ఇప్పుడు జాతీయ మిషన్ కింద ఓడ నుండి బిలియన్ల డాలర్ల విలువైన నిధిని సేకరించబోతోంది. కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా మాట్లాడుతూ నిధిని వెలికితీసే చర్యలు ఆసన్నమవుతాయని అన్నారు. బ్లూమ్‌బెర్గ్‌తో  జువాన్ డేవిడ్ కొరియా మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని, పనిని వేగవంతం చేయాలని రాష్ట్రపతి కోరారు. 

 ఓడ సంపదపై వివాదం కూడా తలెత్తింది, స్పెయిన్, కొలంబియా ఇంకా  బొలీవియాకు చెందిన ఖరా ఖోన్ (Khara-Khoen) నేషన్ అనే తెగ వారు ఓడ  నిధిపై దావా వేశారు. స్పానిష్ వారి పూర్వీకులను విలువైన లోహాలను తవ్వమని బలవంతం చేశారని ఈ గిరిజన దేశం పేర్కొంది. మునిగిపోయిన ఓడలోని వెలకట్టలేని నిధిని తన పూర్వీకులు తవ్వించారని, అందుకే దానిపై తమకు హక్కు ఉందని చెప్పారు.

అదే సమయంలో, అమెరికన్ కంపెనీ గ్లోకా మోరా కూడా నిధిని క్లెయిమ్ చేసింది. 1981లో దాన్ని కనుగొన్నామని, ఆ తర్వాత ఓడ ఎక్కడ మునిగిపోయిందో కొలంబియా ప్రభుత్వానికి చెప్పిందని అమెరికా కంపెనీ చెబుతోంది. కొలంబియా ఓడ నిధిలో సగం విలువ చెల్లిస్తానని హామీ ఇచ్చిందని కూడా కంపెనీ ఆరోపించింది.

Follow Us:
Download App:
  • android
  • ios