Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..నేడు మళ్ళీ పెంపు..

ముడి చమురు రేట్లు బ్యారెల్ మార్కుకు 40 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఇంధన రేట్లు భారతదేశంలో నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 

today petrol, diesel price has gone up agian  by more than rs.3 less than a week
Author
Hyderabad, First Published Jun 12, 2020, 11:21 AM IST

న్యూ ఢిల్లీ: గత నెలలో ఎక్సైజ్ సుంకం పెరగడంతో, పెట్రోల్ ధర లీటరుకు 3.31 డాలర్లు, డీజిల్ ధర లీటరుకు 3.42 డాలర్లు పెరిగింది. ప్రభుత్వ చమురు సంస్థలు పెట్రోల్ ధరపై లీటరుకు 57 పైసలు, డీజిల్ ధర పై  59 పైసలు పెంచింది.

ముడి చమురు రేట్లు బ్యారెల్ మార్కుకు 40 డాలర్లకు పడిపోయినప్పటికీ, ఇంధన రేట్లు భారతదేశంలో నాలుగున్నర నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌ పై  లీటరుకు రూ. 13 పెంచింది. ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో తక్కువ ఉన్నప్పుడు పెంపు ప్రభావం వినియోగదారులపై  పడలేదు.

ప్రముఖ నగరాల్లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు:

న్యూ ఢిల్లీ: పెట్రోల్ లీటరుకు 74.57 డీజిల్ లీటరుకు 72.81

గుర్గావ్: పెట్రోల్ లీటరుకు 73.75. డీజిల్ లీటరుకు 65.82

ముంబై: పెట్రోల్ లీటరుకు 81.53. డీజిల్ లీటరుకు 71.48

also read గుడ్ న్యూస్ ఇకపై మూడు రోజుల్లోనే పి‌ఎఫ్ విత్ డ్రా..

చెన్నై: పెట్రోల్ లీటరుకు 78.47. డీజిల్ లీటరుకు 71.14

హైదరాబాద్: పెట్రోల్ లీటరుకు 77.41. డీజిల్ లీటరుకు 71.16

బెంగళూరు: పెట్రోల్ లీటరుకు 76.98. డీజిల్ లీటరుకు 69.22

మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్  ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని రెండుసార్లు పెంచింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా సెస్ లేదా వ్యాట్‌ను పెంచాయి. 

ఏప్రిల్‌లో భారీ తిరోగమనం తరువాత, మే నుండి ఏప్రిల్‌లో పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు వరుసగా 81.8% మరియు 69.1% పెరిగాయని తాజా డేటా చూపిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పెరగడం ప్రారంభించాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios