Asianet News TeluguAsianet News Telugu

నేడే అక్షయ తృతీయ: కరోనాతో ఆన్‌లైన్ సేల్స్‌కే ‘గోల్డ్’ పరిమితం

కరోనా వచ్చినా.. ప్రక్రుతి వైపరీత్యం సంభవించినా కాలం ఆగదు.. ముందుకు సాగుతూ ఉంటుంది. టైంతోపాటు పండుగలొస్తున్నాయి. 
నెలకు పైగా గడిచిన లాక్‌డౌన్‌లోనే తెలుగు సంవత్సరాది (ఉగాది), శ్రీరామనవమి జరుపుకున్నాం. 
 

This Akshaya Tritiya heres how you can buy gold online amid Covid-19 lockdown
Author
Hyderabad, First Published Apr 26, 2020, 10:48 AM IST

నేడే అక్షయ తృతీయ: కరోనాతో ఆన్‌లైన్ సేల్స్‌కే ‘గోల్డ్’ పరిమితం
కరోనా వచ్చినా.. ప్రక్రుతి వైపరీత్యం సంభవించినా కాలం ఆగదు.. ముందుకు సాగుతూ ఉంటుంది. టైంతోపాటు పండుగలొస్తున్నాయి. 
నెలకు పైగా గడిచిన లాక్‌డౌన్‌లోనే తెలుగు సంవత్సరాది (ఉగాది), శ్రీరామనవమి జరుపుకున్నాం. 

అంతలో పసిడి పండగ రానే వచ్చింది. అదే అక్షయ తృతీయ.. బంగారం కొనుగోళ్లకు మంగళకరంగా భావించే రోజు. మంచి రోజైనా.. నగల షాపులు కరోనా ‘లాక్ డౌన్’ వల్ల మూతపడ్డాయి. 

ఈ లాక్‌డౌన్‌లోనూ గోల్డ్‌ కొనుగోలుకు ఆన్‌లైన్‌ మార్గం ఉంది. కరోనా కష్టాల్లోనూ కనకం కొనాలా? వద్దా? అని తేల్చుకోవాల్సింది వినియోగదారులే. ఈసారి అక్షయ తృతీయకు ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోళ్లకు పలు ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్‌తోపాటు లోహ రూపంగానూ కొనుగోలు చేయవచ్చు. 

లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆన్‌లైన్‌లో ఫిజికల్ పసిడి కొనేందుకు అవకాశం ఉంది. ఆభరణాలు, బిస్కెట్‌, కాయిన్స్‌ ఆర్డర్‌ చేయవచ్చు. పలు ప్రముఖ జువెలరీ బ్రాండ్లతోపాటు పలు బ్యాంకులు సైతం ఆన్‌లైన్‌ కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి.

తనిష్క్‌, కల్యాణ్‌ జువెలర్స్‌, మలబార్‌, జోయాలుక్కాస్‌ తదితర షోరూమ్‌లు అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించాయి. పసిడికి స్వచ్ఛత సమస్యలుంటాయి. ఆభరణాలైతే మజూరీ చార్జీలు అదనంగా చెల్లించాలి. మనం విక్రయించాలనుకున్నప్పుడు తరుగు తీసేస్తారు. 

వ్యక్తిగత అవసరాల కోసమైతే ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు కానీ పెట్టుబడి కోసమైతే డిజిటల్‌ పథకాలే మేలు. ఎందుకంటే, ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్‌ గోల్డ్‌పైనే అధిక ప్రతిఫలం లభిస్తుంది. 

పసిడిలో పెట్టుబడులకిది మంచి ప్రత్యామ్నాయం. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్)ను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నుంచి కొనుగోలు చేయొచ్చు. మార్కెట్‌ ధరకు అందుబాటులో ఉంటాయి. అవసరం అయినప్పుడు విక్రయించనూ వచ్చు. 

గోల్డ్ ఈటీఎఫ్ కొనుగోళ్ల విషయమై లాకిన్‌ పీరియడ్‌ వంటి నిబంధనలేం ఉండవు.  కాకపోతే ఈటీఎఫ్‌ల క్రయవిక్రయాల కోసం డీమ్యాట్‌ ఖాతా తెరువాల్సి ఉంటుంది. అంతకుమించి ఈ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్‌టీసీజీ) పన్ను సైతం చెల్లించాల్సి ఉంటుంది. 

డిజిటల్‌ రూపంలో గోల్డ్‌ కొనుగోళ్ల ప్రోత్సాహానికి 2015 నవంబర్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ.. బంగారం బాండ్లను జారీ చేస్తుంది. ఇవి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతాయ్‌. 

అవసరమైతే వీటిని తాకట్టు పెట్టి రుణాలు సైతం పొందవచ్చు. బంగారు బాండ్‌ యూనిట్‌ ఒక గ్రాముతో సమానం. ఈ పథకంలో కనీసం ఒక గ్రాము కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఏడాది మొత్తంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) 4 కేజీల వరకు కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు, చారిటీ సంస్థలు 20 కిలోల వరకు కొనేందుకు వీలుంది. ఈ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. ఐదేళ్లు పూర్తయ్యాక పెట్టుబడులను ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రపంచ మానవాళిని వణికిస్తున్న వేళ కరోనా సంక్షోభ కాలంలో బంగారం మినహా ఇతర పెట్టుబడులన్నింటి (ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్లు తదితరాలు) విలువలు భారీగా క్షీణించాయి. ఆర్థిక అనిశ్చితిలో ఆదుకునే పెట్టుబడి సాధనంగా బంగారానికి పేరు ఉంది.

అందుకే షేర్లు, మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తులు కుప్పకూలుతున్న తరుణంలో బంగారం మాత్రం చాలా ఎత్తుకు ఎగబాకింది. అంతర్జాతీయంగా ధర ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరువైంది. ఈ తరుణంలో పసిడిలో పెట్టుబడి పెట్టాలా..? వద్దా..? అన్నది సగటు మదుపరుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. 

ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న బంగారం ధరలు కొంత దిద్దుబాటుకు లోనయ్యాక పెట్టుబడులు పెట్టడం మేలని కమోడిటీ మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. తులం ధర రూ.38,000-40,000 స్థాయికి తగ్గాక పెట్టుబడులు పెడితే దీర్ఘకాలికంగా మంచి రిటర్నులు లభించే అవకాశం ఉంటుందని ఏంజిల్‌ బ్రోకింగ్‌ కమోడిటీస్‌, కరెన్సీస్‌ డిప్యూటీ వీపీ అనూజ్‌ గుప్తా అంటున్నారు. 

రిటైల్‌ మదుపర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో బంగారానికి ఎంత కేటాయించాలనే అంశమూ కీలకమే. బంగారంలో భారీగా లాభాలు వస్తున్నాయని మొత్తం పెట్టుబడులను ఈ లోహంలోకే మళ్లించడం తగదని ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు సూచిస్తున్నారు. 

భవిష్యత్‌లో బంగారం ధరల్లో భారీ కరెక్షన్‌ చోటుచేసుకుంటే పెట్టుబడులు హారతి కర్పూరంలా కరిగిపోయే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్ల వ్యక్తిగత అవసరాలు, భవిష్యత్‌ లక్ష్యాలు, రిస్క్‌ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో 5-15% వరకు బంగారానికి కేటాయించవచ్చని వారు సూచిస్తున్నారు. 

గతేడాది ద్వితీయార్ధం నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో రయ్‌.. రయ్‌మంటూ ఎగబాకాయి. ఈనెల 22న ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రేటు రూ.47,300కు పెరిగింది. దాంతో దేశీయంగా బంగారం సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. 

వారాంతం ట్రేడింగ్‌ (శుక్రవారం)లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,500 వద్ద ముగిసింది. అంటే, గత ఏడాది అక్షయ తృతీయతో పోలిస్తే 47 శాతం పెరిగింది. 2019లో అక్షయ తృతీయ నాడు పది గ్రాముల బంగారం ధర రూ.31,500 ఉంటే, ఈ ఏడాది రూ.46,500 
 

Follow Us:
Download App:
  • android
  • ios