సామాన్యులకు ఊరట, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.15 వరకూ తగ్గే చాన్స్, బలమైన కారణాలు ఇవే..
అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడం పెట్రోల్, డీజిల్ ధరలపై మంచి సంకేతాలు ఇస్తోంది. దీని కారణంగా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధర రూ.10-14 తగ్గవచ్చనే అంచనాలు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడం పెట్రోల్, డీజిల్ ధరలపై పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. దీని కారణంగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధర రూ.10-14 తగ్గవచ్చనే వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు బ్యారెల్ ధర జనవరి నుండి కనిష్ట స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇది బ్యారెల్కు దాదాపు 83 డాలర్లు నడుస్తోంది. అదే సమయంలో, అమెరికన్ క్రూడ్ ధరలు కూడా బ్యారెల్కు 78 డాలర్ల వద్ద ఉన్నాయి.
9 నెలల్లో బ్యారెల్కు 30 డాలర్ల చొప్పున తగ్గిన ధరలు:
ముడి చమురు ధరలో భారీ పతనం భారతీయ రిఫైనరీలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మార్చి వరకు, భారతీయ రిఫైనరీలు ఒక బాస్కెట్ ముడి చమురు కోసం 112 డాలర్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు అవి బ్యారెల్కు 83 డాలర్లు మాత్రమే లభిస్తున్నాయి. దీని ప్రకారం, రిఫైనింగ్ కంపెనీలకు ముడి చమురు ధర బ్యారెల్కు సుమారు 30డాలర్ల వరకు తగ్గింది. ఈ నేపథ్యంలో, పెట్రోలియం కంపెనీలు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు కూడా అందించవచ్చని భావిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను రూ.10 నుంచి 14 ఎందుకు తగ్గించవచ్చు?
ముడి చమురు బ్యారెల్కు 1 డాలర్ చొప్పున తగ్గిస్తే, చమురు కంపెనీలు శుద్ధి చేయడంపై ప్రతి లీటరుకు దాదాపు 45 పైసలు ఆదా అవుతుందని, పెట్రోలియం విషయాలకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రానున్న కొద్ది నెలల్లో పెట్రోలు, డీజిల్ ధరల్లో 10 నుంచి 14 రూపాయల వరకు తగ్గుదల కనిపించవచ్చు. అయితే, ఈ తగ్గింపు ఒక్కసారిగా జరుగుతుందా.. లేక రెండు మూడు సార్లు జరుగుతుందా అనే విషయంపై ఏమీ చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు.
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది అనడానికి 3 కారణాలు:
చమురు కంపెనీల పొదుపు చర్యలు:
దేశంలో ప్రస్తుతం ఉన్న పెట్రోలు, డీజిల్ ధరల ప్రకారం, భారత బాస్కెట్ ముడి చమురు బ్యారెల్కు 85 డాలర్లు ఉండాలి. అయితే, రిఫైనింగ్ కంపెనీలకు బ్యారెల్కు 83 డాలర్లు ఖర్చవుతోంది. దీని ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో బ్యారెల్పై దాదాపు రూ.245 ఆదా చేస్తున్నాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇకపై నష్టాలను చవిచూడవు:
పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ - చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు పెట్రోల్ అమ్మకాలపై లాభాలు గడిస్తున్నాయని అన్నారు. అయితే ప్రస్తుతం డీజిల్ విషయంలో అలా కాదు. అప్పటి నుండి బ్రెంట్ క్రూడ్ 10 శాతం చౌకగా మారింది. అటువంటి పరిస్థితిలో, ఇప్పుడు కంపెనీలకు డీజిల్పై కూడా ఎలాంటి నష్టం ఉండదని భావిస్తున్నారు.
ముడి చమురు 70 డాలర్ల వైపు కదులుతుంది,
బ్రెంట్ క్రూడ్ ధరలు ప్రస్తుతం బ్యారెల్కు 81 డాలర్లుగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో దీని ధరలు తగ్గుతున్న తీరు చూస్తుంటే రానున్న కాలంలో 70 డాలర్లకు చేరే అవకాశం కనిపిస్తోంది. దాని ప్రత్యక్ష ప్రయోజనం పెట్రోల్ డీజిల్ ధరలలో చూడవచ్చు.