వాట్సప్ డేటా లీక్ వార్తలను కొట్టి పారేసిన మెటా యాజమాన్యం..ఆరోపణలు నిరాధారం అంటూ ప్రకటన..
వాట్సాప్ డేటా లీక్ కు సంబంధించిన వార్తలను నిరాధారమైనవని వాట్సాప్ ఖండించింది.మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫారమ్ వాట్సాప్కు సంబంధించి, దాదాపు 500 మిలియన్ల వినియోగదారుల ఫోన్ నంబర్లు లీక్ అయినట్లు వార్తల్లో నిజంలేదని కంపెనీ స్టేట్ మెంట్ జారీ చేసింది.
డేటా లీక్ వార్తలను వాట్సాప్ ఖండించింది. సైబర్ న్యూస్ వెబ్ సైట్ లో వచ్చిన వార్త పూర్తిగా నిరాధారమని అధికార ప్రతినిధి తెలిపారు. స్క్రీన్ షాట్ ఫేక్ అని అన్నారు. డేటా లీక్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు సంబంధించి, సుమారు 500 మిలియన్ల వినియోగదారుల ఫోన్ నంబర్లు లీక్ అయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆన్లైన్ మార్కెటింగ్ను కూడా ప్రోత్సహిస్తున్నారని. సైబర్ న్యూస్ ఈ వాదన చేస్తోంది.
హ్యాకింగ్ ఫోరమ్లో, 84 దేశాలకు చెందిన వాట్సాప్ వినియోగదారులు వ్యక్తిగత సమాచారం అమ్మకానికి అందుబాటులో ఉందని సైబర్ న్యూస్ క్లెయిమ్ చేస్తున్నారు. కేవలం యుఎస్లోనే 32 మిలియన్ల మంది వినియోగదారుల సమాచారం అందుబాటులో ఉందని డేటా వెండర్ తెలిపారు.
భారతదేశంతో సహా ఈ దేశాల వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది
WhatsApp వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అమ్మకానికి అందుబాటులో ఉన్న 84 దేశాలు భారతదేశం, రష్యా, ఇటలీ, ఈజిప్ట్, ఇటలీ, UK. ఈ దేశాల వినియోగదారులు డేటా లీక్లను నివేదిస్తున్నారు.
US డేటాసెట్లు చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి
డేటాను విక్రయిస్తున్న వ్యక్తి US డేటాసెట్ 7,000 డాలర్లకు అందుబాటులో ఉందని పేర్కొన్నాడు. UK డేటాసెట్లు 2500 డాలర్లకి విక్రయిస్తున్నారు. డేటా లీక్పై ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదని తెలిసింది.