Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకింగ్ వ్యాపారంలోకి భారతదేశ అతిపెద్ద వ్యాపార సంస్థలు.. త్వరలోనే అందుబాటులోకి ?

కొన్ని మూలాల ప్రకారం, ఈ సంస్థలు ఆర్‌బిఐ మార్గదర్శకాలు తమకు అనుకూలంగా ఉన్నాయా అని అంచనా వేస్తున్నాయి. దీని తరువాత బ్యాంకింగ్ రంగం వైపు తదుపరి చర్య తీసుకోనున్నారు. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీ ఇండస్ట్రియల్ హౌస్‌కు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి బ్యాంకింగ్ చట్టాన్ని మార్చాలని సూచించింది. 

tata birla bajaj and piramal group may lead race for banking business sector
Author
Hyderabad, First Published Nov 24, 2020, 2:49 PM IST

భారతదేశంలోని అతిపెద్ద వ్యాపార వర్గాలు బ్యాంకింగ్ లైసెన్స్ పొందటానికి అడుగులు వేస్తున్నాయి. ఇందులో టాటా గ్రూప్, బిర్లా గ్రూప్, పరిమల్ గ్రూప్, బజాజ్ వంటి ప్రముఖ వ్యాపార వర్గాలు ఉన్నాయి. కొన్ని మూలాల ప్రకారం, ఈ సంస్థలు ఆర్‌బిఐ మార్గదర్శకాలు తమకు అనుకూలంగా ఉన్నాయా అని అంచనా వేస్తున్నాయి.

దీని తరువాత బ్యాంకింగ్ రంగం వైపు తదుపరి చర్య తీసుకోనున్నారు. ఇటీవల, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమిటీ ఇండస్ట్రియల్ హౌస్‌కు బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడానికి బ్యాంకింగ్ చట్టాన్ని మార్చాలని సూచించింది. అటువంటి పరిస్థితులలో భవిష్యత్తులో భారతదేశంలోని పెద్ద పారిశ్రామిక సంస్థల బ్యాంకులను అందుబాటులోకి రవొచ్చు.

రూ.50 వేల కోట్లకు పైగా ఆస్తులున్న పారిశ్రామిక గృహాలను బ్యాంకులుగా మార్చాలని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సూచించింది. ప్రస్తుతం టాటా క్యాపిటల్ ఆస్తులు సుమారు 74,500 కోట్ల రూపాయలు, ఆదిత్య బిర్లా యొక్క ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఆస్తులు సుమారు 59,000 కోట్ల రూపాయలు.

అదేవిధంగా 2019 ఆర్థిక సంవత్సరంలో బజాజ్ ఫైనాన్స్‌కు రూ.1.15 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. పిరమల్ గ్రూప్ కూడా బ్యాంకింగ్ రంగంలోకి ప్రవేశించడానికి మెరుగైన అడుగులు వేస్తుంది.

also read 64 దేశాలు, రూ.37 కోట్ల నిధి.. మంచి గుర్తింపుతో ముగిసిన వర్చువల్ ఐజిడిసి 2020 ...

టాటా గ్రూప్ సాఫ్ట్‌వేర్ రంగంలో చురుకుగా ఉంటుంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ గత ఏడాదిలో వేల కోట్ల రూపాయల వృద్ధిని నమోదు చేసింది. టాటా గ్రూప్ స్టీల్, వెహికల్, ఎనర్జీ రంగాలలో విస్తృతంగా పెట్టుబడులను కూడా పెడుతోంది. 2017, 2019 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్, టాటా మోటార్, టాటా పవర్ కలిసి 74 వేల కోట్ల వ్యాపారం చేసింది.

అదేవిధంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దాదాపు అన్ని పారిశ్రామిక రంగాలలో కీలకమైన ప్రధాన పాత్ర పోషించింది. బిర్లా గ్రూప్ బృందం ఫైబర్, నాన్-ఫెర్రస్ లోహాలు, సిమెంట్, విస్కోస్ ఫిల్మ్ నూలు బ్రాండెడ్ దుస్తులు, కార్బన్ బ్లాక్, రసాయనాలు, రిటైల్, ఎరువులు, రసాయనాలు, ఆర్థిక సేవలు, టెలికమ్యూనికేషన్స్, బిపిఓ, ఐటి సేవలలో వ్యవహరిస్తుంది.

బజాజ్ గ్రూప్ భారతదేశంలో ఒక ముఖ్యమైన పారిశ్రామిక గ్రూప్. దీనిని 1926లో జమ్నాలాల్ బజాజ్ స్థాపించారు. ప్రస్తుతం బజాజ్ 34 కంపెనీల హ్రౌప్, వీటిలో 6 కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. బజాజ్ ఆటో లిమిటెడ్ కాకుండా ముకుంద్ లిమిటెడ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, బజాజ్ హిందూస్తాన్ లిమిటెడ్ దాని ప్రధాన సంస్థలు.

అలాగే  పిరమల్ గ్రూప్ ఔ'షధాల వ్యాపారం చేస్తుంది. ఈ బృందం ఆరోగ్య పరిష్కారాల నుండి ఔషధల ఆవిష్కరణ వరకు పాల్గొంటుంది. దేశంలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ పిరమల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ పిరమల్ ను వివాహం చేసుకున్నారు.

ఇషా అంబానీ వివాహం తర్వాత కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యాపారంలో చురుకుగా ఉన్నారు. ఇటీవల రిలయన్స్ 43వ సమావేశంలో ముఖేష్ అంబానీతో పాటు ఇషా అంబానీ ప్రసంగించారు.

Follow Us:
Download App:
  • android
  • ios