Asianet News TeluguAsianet News Telugu

Budget 2020: బడ్జెట్ 2020 ఎఫెక్ట్, ఫ్లాట్ గా ప్రారంభమయిన స్టాక్ మార్కెట్లు

డిమాండ్, ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా పెట్టుబడిదారులు కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నందున సీతారామన్ బడ్జెట్  కంటే ముందే  స్టాక్ మార్కెట్లు  అస్థిరంగా  ఉంటాయని భావిస్తున్నారు.

stock markets open flat today ahead of budget 2020 session
Author
Hyderabad, First Published Feb 1, 2020, 12:25 PM IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2020 ప్రదర్శనకు ముందు భారత మార్కెట్లు శనివారం ఫ్లాట్ గా ప్రారంభం అయ్యాయి.ప్రారంభ సెషన్‌లో బిఎస్‌ఇ సెన్సెక్స్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. తరువ్త సెన్సెక్స్ 52.58 పాయింట్లు లేదా 0.13 శాతం అధికంగా 40,777.87 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 58 పాయింట్లు లేదా 0.48 శాతం క్షీణించి 11,979.15 వద్ద ఉంది.

ఈ రోజు ప్రారంభంలో అత్యధిక లాభాలు పొందినవారు హెచ్‌యుఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకి, ఏషియన్ పెయింట్స్. ప్రారంభ వాణిజ్య సెషన్‌లో టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, ఎన్‌టిపిసి, కోటల్ బ్యాంక్, హెచ్‌సిఎల్ టెక్ అగ్రస్థానంలో నిలిచాయి.

చైనాలో కరోనావైరస్ వ్యాప్తి కారణంగా వెలుగులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత దేశీయ మార్కెట్లో నష్టాలు సంభవిస్తున్నాయి. డా జోన్స్ 603 పాయింట్లు లేదా 2.1 శాతం 28,256 వద్ద పడిపోగా, ఎస్ అండ్ పి 58 పాయింట్లను కోల్పోయింది.

డిమాండ్, ఆర్థిక వృద్ధిని పెంచే దిశగా పెట్టుబడిదారులు కొన్ని ప్రకటనలు ఆశిస్తున్నందున సీతారామన్ బడ్జెట్ కంటే ముందే మార్కెట్లు అస్థిరంగా ఉంటాయని భావిస్తున్నారు. మార్కెట్లలో పాల్గొనేవారు కూడా ఈక్విటీలపై పన్ను రాయితీలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

నిర్మలా సీతర్మాన్ త్వరలోనే 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పన్నులను హేతుబద్ధీకరించాలని, వృద్ధి మందగమనాన్ని పరిష్కరించడానికి అధిక వ్యయ చర్యలను ప్రకటించాలని విస్తృతంగా భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios