Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్‌ రికార్డ్ బ్రేకింగ్.. కొనసాగుతున్న బుల్ జోరు.. లాభాల స్వీకరణకు అవకాశం..

స్టాక్‌ మార్కెట్లలో ఈ వారం లాభాల స్వీకరణ జరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సూచీల రికార్డు ర్యాలీతో అనేక షేర్లు అధిక విలువల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా (శుక్రవారం) స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సెలవు.  

Share Market: The trend of record breaking growth continues in the market, the direction will be decided by these factors this week
Author
Hyderabad, First Published Sep 6, 2021, 12:31 PM IST

గత వారం రికార్డు స్థాయిలో ముగిసిన స్టాక్ మార్కెట్  నేడు సోమవారం అత్యధిక స్థాయిలో మళ్లీ ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 263.92 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 58399.87 వద్ద ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 73.70 పాయింట్ల లాభంతో (0.43 శాతం) 17397.30 వద్ద ప్రారంభమైంది. ప్రారంభ ట్రేడ్‌లో 1456 షేర్లు పెరిగాయి, 409 షేర్లు క్షీణించాయి, 122 షేర్లు మారలేదు. గత వారంలో సెన్సెక్స్ 2,005.23 పాయింట్లు అంటే 3.57 శాతం పెరిగింది.   

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ వారం కూడా షేర్ మార్కెట్ సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే హై వాల్యు ఉన్న కారణంగా మార్కెట్‌లో కొంత లాభం-బుకింగ్ ఉండవచ్చు.  

 ఈ వారంలో గణేష్ చతుర్థి కారణంగా  శుక్రవారం స్టాక్ మార్కెట్లు మూసివేయబడుతుంది. అంటే ఈ వారం మొత్తంలో నాలుగు రోజులే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, కరోనా వాక్సిన్ కారణంగా షేర్ మార్కెట్ కూడా ఉత్సాహంగా ఉంటుందని భావిస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రూపాయిలో అస్థిరత, బ్రెంట్ ముడి చమురు ధరలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పెట్టుబడి వైఖరి కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి.

ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో ఆర్‌ఐ‌ఎల్, హెచ్‌యూ‌ఎల్, ఎం& ఎం, బజాజ్ ఆటో, ఎల్& టి, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డి, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్‌టెల్, మారుతి,  ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్, ఎస్‌బి‌ఐ, సన్ ఫార్మా, ఎన్‌టి‌పి‌సి, ఇండస్ఇండ్ బ్యాంక్,హెచ్‌డి‌ఎఫ్‌సి, ఇన్ఫోసిస్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, ఐ‌టి‌సి, హెచ్‌సి‌ఎల్ టెక్ లాభాలతో ప్రారంభమయ్యాయి. మరోవైపు టైటాన్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా ఏషియన్ పెయింట్స్, టిసిఎస్ షేర్లు నష్టాలతో  ప్రారంభమయ్యాయి.

also read దిగోస్తున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. హైదరాబాద్‌లో పసిడి ఎంతంటే..!

ప్రీ-ఓపెన్ సమయంలో
ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో సెన్సెక్స్ 58,359.23 స్థాయిలో 229.28 పాయింట్లు (0.39 శాతం) పెరిగింది. నిఫ్టీ 116.40 పాయింట్లు (0.67 శాతం) పెరిగి 17,440 వద్ద ఉంది.

సెక్టోరల్ ఇండెక్స్‌ 
సెక్టోరల్ ఇండెక్స్‌ని చూస్తే నేడు అన్ని రంగాలు గ్రీన్ మార్క్‌లో ప్రారంభమయ్యాయి. వీటిలో ఎఫ్‌ఎం‌సి‌జి, బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ సర్వీస్, ఆటో, పి‌ఎస్‌యూ బ్యాంక్, మీడియా, రియల్టీ, మెటల్, ఐ‌టి, ఫార్మా ఉన్నాయి.

సెన్సెక్స్-నిఫ్టీ శుక్రవారం రికార్డు స్థాయిలో ముగిసింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ రోజంతా ఒడిదుడుకుల తర్వాత గ్రీన్ మార్క్‌లో ముగిసింది. సెన్సెక్స్ 277.41 పాయింట్ల (0.48 శాతం) లాభంతో 58,129.95 వద్ద ముగియగా  మరోవైపు నిఫ్టీ 89.45 పాయింట్ల (0.52 శాతం) లాభంతో 17,323.60 వద్ద ముగిసింది.

భారత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. గడిచిన ఆగస్టులో మొత్తం రూ.16,459 కోట్లు కొనుగోళ్లు జరిపారు. ఇందులో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.2,083 షేర్ల విలువైన షేర్లను కొన్నారు. డెట్‌ మార్కెట్‌లో రూ.14,376 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. 

జల్‌ శక్తి శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహించే పీఎస్‌యూ వ్యాప్‌కోస్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. మార్చికల్లా ఇష్యూను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీవో ద్వారా ప్రభుత్వం వ్యాప్‌కోస్‌లో 25 శాతం వాటాను విక్రయించే యోచనలో ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios