Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ పై మళ్ళీ కరోనా ఎఫెక్ట్ : భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 740.19 పాయింట్లు లేదా 1.51 శాతం క్షీణించి 48440.12 వద్ద ముగిసింది. మరోవైపు  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 224.50 పాయింట్లు లేదా 1.54 శాతం క్షీణించి 14324.90 స్థాయిలో ముగిసింది.

share market : sensex and nifty today closing indian benchmark ended lower sensex down by 740 points
Author
Hyderabad, First Published Mar 25, 2021, 6:54 PM IST

నేడు స్టాక్ మార్కెట్ అంటే గురువారం భారీ క్షీణతతో ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్ సెన్సెక్స్ 740.19 పాయింట్లు లేదా 1.51 శాతం క్షీణించి 48440.12 వద్ద ముగిసింది. మరోవైపు  నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 224.50 పాయింట్లు లేదా 1.54 శాతం క్షీణించి 14324.90 స్థాయిలో ముగిసింది.

30 షేర్ల బిఎస్‌ఇ సెన్సెక్స్ అంతకుముందు వారంలో 933.84 పాయింట్లు లేదా 1.83 శాతం కోల్పోయింది.  దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం, వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ విధిస్తుండడం, ఆర్థిక రికవరీ భయాలతో మదుపర్లు అమ్మకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. దాదాపు అన్ని రంగాల షేర్లూ నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. 

ఈ రోజు సెన్సెక్స్ వారంలోని అత్యల్ప స్థాయిలో ముగిసింది. మార్చి 22న 49771 వద్ద, మార్చి 23న 50051 వద్ద, మార్చి 24న 49180, నేడు మార్చ్ 25న 48440కి చేరుకుంది.

హెవీవెయిట్స్ స్టాక్స్ విషయంలో  ఈ రోజు టాటా స్టీల్, డాక్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డి‌ఎఫ్‌సి, ఎల్ అండ్ టి షేర్లు లాభాల మీద ముగిశాయి. ఐఓసి, మారుతి, కోల్ ఇండియా, భారతి ఎయిర్‌టెల్, హిందుస్తాన్ యునిలివర్ షేర్లు నష్టాలతో  ముగిశాయి. 

also read విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుండి అమలు.. రెండేళ్ల లోపు పిల్లలకు మినహాయింపు.. ...

ప్రపంచ మార్కెట్ హెచ్చుతగ్గులు
గ్లోబల్ మార్కెట్ల గురించి చూస్తే నాస్ డాక్ ఇండెక్స్ 265 పాయింట్లు లేదా 2 శాతం పడిపోయి 12,961 పాయింట్ల వద్ద ముగిసింది. డౌ జోన్స్ సూచీ మూడు పాయింట్లు తగ్గి 32,420 వద్ద ముగిసింది. ఎస్ అండ్ పి 500 సూచీ 21 పాయింట్లు తగ్గి 3,889 పాయింట్లకు చేరుకుంది. హాంకాంగ్‌కు చెందిన హెంగ్‌సెంగ్ సూచీ 52 పాయింట్లు పడిపోయి 27,866 వద్దకు చేరుకుంది.

చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఫ్లాట్ 3,366 వద్ద ట్రేడవుతోంది. జపాన్‌కు చెందిన నిక్కి ఇండెక్స్ 210 పాయింట్లు పెరిగి 28,616 వద్ద ట్రేడవుతోంది. కొరియా  కోస్పి ఇండెక్స్ ఇంకా ఆస్ట్రేలియా యొక్క ఆల్ ఆర్డినరీలు కూడా స్వల్ప లాభాలు ఉన్నాయి.

పెట్టుబడిదారులలో  ఆందోళన పెంచుతున్న  కరోనా
దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ మహమ్మారి డేటా గురించి పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ ఘడ్, గుజరాత్‌లలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కొత్త  కరోనా  కేసులు ఈ రాష్ట్రాలలో 77.44 శాతం ఉన్నాయి.

కరోనా వైరస్  కేసుల పెరుగుతున్న  మధ్య అనేక రాష్ట్రాలు కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. దేశంలో గత 24 గంటల్లో కరోనా సంక్రమణ కారణంగా 53,476 మందికి పైగా ఈ వ్యాధి సోకింది అలాగే 251 మంది మరణించారు. 

ఉదయం సెన్సెక్స్ 57.07 పాయింట్లు (0.12 శాతం) తగ్గి 49,123.24 వద్ద  ప్రారంభమైంది. నిఫ్టీ 30.85 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 14,518.55 వద్ద ప్రారంభమైంది. ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్‌లో 518 షేర్లు లాభపడ్డాయి, 1060 షేర్లు క్షీణించాయి. ఇంకా 65 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. దీని తరువాత మార్కెట్ రోజంతా క్షీణిస్తూనే ఉంది. 

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 871.13 పాయింట్లు లేదా 1.74 శాతం తగ్గి 49180.31 వద్ద ఉండగా, నిఫ్టీ 265.35 పాయింట్లు లేదా 1.79 శాతం క్షీణించి 14549.40 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios