Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్ పై కరోనా కల్లోలం.. సెన్సెక్స్ 1427 పాయింట్లు డౌన్...

కరోనా రోగుల కేసుల పెరుగుదల, కోవిడ్-19 మరణాలు దేశంలో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ కారణంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వహిస్తున్నారు. నేడు వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది.

sensex nifty today: share market 19th april 2021 update opening indian indices opened lower amid corona virus
Author
Hyderabad, First Published Apr 19, 2021, 10:57 AM IST

కరోనా రోగుల సంఖ్య భారీగా పెరగడం అలాగే కోవిడ్-19  మరణాల కారణంగా దేశంలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఏప్రిల్ 3వ వారంలోని మొదటి ట్రేడింగ్ రోజున అంటే సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 1,761.72 పాయింట్లు (2.17 శాతం) పడిపోయి 47770.31 స్థాయిలో ప్రారంభమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 359.90 పాయింట్ల వద్ద 2.46 శాతం తగ్గి 14258 వద్ద ప్రారంభమైంది. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 759.29 పాయింట్లతో 1.53 శాతం కోల్పోయింది. నేడు 183 స్టాక్స్ లాభపడ్డాయి, 615 షేర్లు క్షీణించగా, 53 స్టాక్స్ మారలేదు. 

ఉదయం 9.41 గంటలకు - సెన్సెక్స్ 1427.62 పాయింట్లు (2.92 శాతం) భారీగా పడిపోయి 47404.62 స్థాయికి చేరుకుంది.  నిఫ్టీ 14209.95 వద్ద ట్రేడవుతోంది, ఇది కూడా 407.90 పాయింట్లు అంటే 2.79 శాతం పడిపోయింది.

దేశంలో  కరోనా వైరస్  సెకండ్ వేవ్  విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 2.75 లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదవ్వగా, 1626 మందికి పైగా మరణించారు. 

 ఈ వారం స్టాక్ మార్కెట్లలో చాలా హెచ్చుతగ్గులు ఉండవచ్చు. తక్కువ ట్రేడింగ్ సెషన్లతో స్టాక్ మార్కెట్ ధోరణి ఎక్కువగా కోవిడ్ -19, గ్లోబల్ క్యూస్, కంపెనీల త్రైమాసిక ఫలితాల ద్వారా నిర్ణయించబడుతుందని విశ్లేషకులు అంటున్నారు. అంతే కాకుండా డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి దిశ, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి, ముడి చమురు ధరలు కూడా మార్కెట్ దిశను నిర్ణయిస్తాయి.  బుధవారం రోజున శ్రీ రామ్ నవమి కారణంగా స్టాక్  మార్కెట్ కి సెలవు ఉంటుంది. 

also read భారత్‌లో మళ్లీ పెరిగిన బంగారం దిగుమతులు.. కారణం ఏంటంటే..? ...

 అమెరికా డౌ జోన్స్ శుక్రవారం 0.48 శాతం పెరిగి 164.68 పాయింట్లతో 34,200.70 వద్ద ముగిసింది. నాస్‌డాక్ 13.58 పాయింట్లు పెరిగి 0.10 శాతంతో 14,052.30 వద్ద ముగిసింది. ఫ్రాన్స్ అండ్ జర్మనీలోని మార్కెట్లు కూడా లాభాలలో ముగిశాయి. 

ఆసియా స్టాక్ మార్కెట్లలో హాంకాంగ్  హాంగ్సెంగ్ ఇండెక్స్ 301 పాయింట్లు పెరిగి 29,310 వద్ద ట్రేడవుతోంది. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడా 42 పాయింట్లు పెరిగి 3,468 వద్దకు చేరుకుంది. కొరియాకు చెందిన కోస్పి ఇండెక్స్ 13 పాయింట్ల వద్ద 3,212 వద్ద ట్రేడవుతోంది. ఆస్ట్రేలియా ఆల్ ఆర్డినరీస్ ఇండెక్స్ 15 పాయింట్లు పెరిగి 7,341 కు చేరుకుంది. జపాన్‌కు చెందిన నిక్కి ఇండెక్స్ 27 పాయింట్లు పెరిగి 29,710 వద్ద ట్రేడవుతోంది.

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) ఏప్రిల్‌లో ఇప్పటివరకు భారత మార్కెట్ల నుంచి రూ .4,615 కోట్లను ఉపసంహరించుకున్నారు. పెరుగుతున్న  కోవిడ్ -19 కేసుల మధ్య, వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలను ప్రకటించిన తరువాత విదేశీ పెట్టుబడిదారులలో ఆందోళన మొదలైంది.  డిపాజిటరీ డేటా ప్రకారం, విదేశీ పెట్టుబడిదారులు ఏప్రిల్ 1 నుండి 16 మధ్య షేర్ల నుండి నికర రూ .4,643 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలో  ఎఫ్‌పిఐలు స్టాక్ మార్కెట్లలో రూ .17,304 కోట్లు, ఫిబ్రవరిలో రూ .23,663 కోట్లు, జనవరిలో రూ .14,649 కోట్లు నికర పెట్టుబడులు పెట్టాయి.

 పెద్ద స్టాక్స్ గురించి మాట్లాడితే  ఈ రోజు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో అన్ని షేర్లు నష్టాల మీద ప్రారంభమయ్యాయి. సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డి, టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్, హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, రిలయన్స్, ఐటిసి, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, మారుతి, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఒఎన్‌జిసి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్‌టిపిసి, మొదలైనవి ఉన్నాయి.

ప్రీ-ఓపెన్ సమయంలో స్టాక్ మార్కెట్ 
సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 491.98 పాయింట్లు (1.01 శాతం) 48340.05 స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 276.50 పాయింట్లు (1.89 శాతం) తగ్గి 14341.40 వద్ద ఉంది.

స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాలతో ముగిసింది 
ప్రపంచ మార్కెట్ల సానుకూల ధోరణి మధ్య శుక్రవారం స్టాక్ మార్కెట్ రోజంతా హెచ్చుతగ్గులను చూసింది. సెన్సెక్స్ 28.35 పెరిగి 48,832.03 పాయింట్ల వద్ద ముగిసింది.  నిఫ్టీ 36.40 పాయింట్ల లాభంతో 14,617.85 పాయింట్ల వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios