ప్రముఖ వ్యాపారవేత్త పిల్లలు రిషద్ ప్రేమ్జీ నుండి దివ్య మహీంద్రా వరకు ఎవరిని పెళ్లి చేసుకున్నారో తెలుసా..?
భారతదేశ వ్యాపార ప్రపంచంలో వివాహనికి కూడా చాలా స్వేచ్ఛ ఉంది. భారతదేశ వ్యాపార సంబంధాలలో కూడా చాలా స్వేచ్ఛ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆనంద్ మహీంద్రా కుమార్తె దివ్య మహీంద్రా నుంచి ఐటి రంగానికి చెందిన ప్రముఖ అజీమ్ ప్రేమ్జీ కుమారుడు రిషద్ ప్రేమ్జీ వరకు కుల, మతం వంటి అడ్డు గోడలు పగలగొట్టి వారి జీవిత భాగస్వామిని ఎంచుకున్నారు.
భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త పిల్లలు రిషద్ ప్రేమ్జీ నుండి దివ్య మహీంద్రా వరకు కుల-మత గోడలను పగలగొట్టారు. భారతదేశ వ్యాపార ప్రపంచంలో వివాహనికి కూడా చాలా స్వేచ్ఛ ఉంది. భారతదేశ వ్యాపార సంబంధాలలో కూడా చాలా స్వేచ్ఛ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.
ఆనంద్ మహీంద్రా కుమార్తె దివ్య మహీంద్రా నుంచి ఐటి రంగానికి చెందిన ప్రముఖ అజీమ్ ప్రేమ్జీ కుమారుడు రిషద్ ప్రేమ్జీ వరకు కుల, మతం వంటి అడ్డు గోడలు పగలగొట్టి వారి జీవిత భాగస్వామిని ఎంచుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా వారి పిల్లలు జీవిత భాగస్వాములని ఎన్నుకున్న వారిని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తామని చెప్పారు. ఇప్పుడు దివ్య మహీంద్రా, రోష్ని నాదర్, రిషద్ ప్రేమ్జీ మొదలైన వారు ఎవరిని వివాహం చేసుకున్నారో తెలుసుకుందాం…
రిషద్ ప్రేమ్జీ : విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్జీ వ్యాపార అంశాలకు సంబంధించి తరచూ చర్చల్లో ఉంటారు, కానీ అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా అరుదుగా మాట్లాడతారు. రిషద్ ప్రేమ్జీ 2005లో తన చిన్ననాటి స్నేహితురాలు అదితిని వివాహం చేసుకున్నారు.
also read భేటీకి అమెజాన్ డుమ్మా: పార్లమెంట్ కమిటీ సీరియస్.. చర్యలు తప్పవంటూ వార్నింగ్ ...
రిషద్ ప్రేమ్జీ కూడా తన తండ్రి అజీమ్ ప్రేమ్జీ లాగా సరళంగా వ్యవహరించే వ్యక్తి. 2005 ఆగష్టులో అదితిని వివాహం చేసుకోవడానికి కారణం ఇదే కావచ్చు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకున్న రిషద్ ప్రేమ్జీ, అదితిలకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు, ఒకరు రోహన్ ప్రేమ్జీ మరొకరు రియా ప్రేమ్జీ ఉన్నారు.
రోష్ని నాదర్: హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాదర్ కుమార్తె రోష్ని నాదర్ మల్హోత్రా శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రోష్ని నాదార్ కుటుంబం తమిళం, శిఖర్ మల్హోత్రా కుటుంబం పంజాబీ.
అయితే వీరిద్దరు సుదీర్ఘ సంబంధం తరువాత 2009లో వివాహం చేసుకున్నారు. ఇటీవల హెచ్సిఎల్ వ్యవస్థాపకుడు శివ నాదార్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు, ఇప్పుడు ఆయన స్థానంలో రోష్ని నాదర్ మల్హోత్రా భాధ్యతలు చేపట్టారు.
దివ్య మహీంద్రా : ఆటో సెక్టార్ వెటరన్ ఆనంద్ మహీంద్రా కుమార్తె దివ్య మహీంద్రా, న్యూయార్క్లో నివసిస్తున్న వృత్తిరీత్యా వాస్తుశిల్పి అయిన లాటిన్ అమెరికన్ వ్యక్తి జార్జ్ జపాటాను ఆమె వివాహం చేసుకున్నారు.
దివ్య మహీంద్రా, జార్జ్ జపాటా 2014లో న్యూయార్క్లో ప్రైవేట్ వేడుకలో వివాహం చేసుకున్నారు. దివ్య మహీంద్రా ఆమె తల్లి అనురాధ మహీంద్రాతో కలిసి ఒక పత్రికను కూడా నిర్వహిస్తుంది. ఆమె దానిని స్థాపించి, నిర్వహిస్తుంది.