రిలయన్స్ జియో మరోసారి వినియోగదారులపై భారం మోపింది. మరోసారి రీచార్జ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంచుతూ రిలయన్స్ జియో కీలక ప్రకటన చేసింది. .  

జియో వినియోగదారులకు రిలయన్స్ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. మొదట్లో ఉచితంగానే అపరిమిత డాటా అందించిన జియో మెళ్లిగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు టారీఫ్ ప్లాన్స్ భారీగా పెంచుతూ వినియోగదారులకు షాక్ ఇస్తోంది. తాజాగా కొనసాగుతున్న ప్రిపెయిడ్ టారీఫ్ ప్లాన్స్ ను ఏకంగా 25 శాతం పెంచింది జియో. ఈ మేరకు రిలయన్స్ జియో ఇవాళ కీలక ప్రకటన చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తాజాగా పెంచిన రిచార్జ్ ప్లాన్ వివరాలను జియో వెల్లడించింది. రెండేళ్ల క్రితమే జియో టారీప్స్ పెరిగాయి... మళ్ళీ ఇప్పుడు మరోసారి టారీఫ్స్ పెంచుతూ రియలన్స్ సంస్థ నిర్ణయం తీసుకుంది. దీంతో జియో వినియోగదారులపై మరింత భారం పడనుంది. జియో రీచార్జ్ ప్లాన్స్ ధరల పెంపుపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన టారీఫ్స్ ప్రకారం జియో రీచార్జ్ ప్లాన్స్ వివరాలివే..: