Asianet News TeluguAsianet News Telugu

మనీలాండరింగ్ కేసుల్లో నీరవ్ మోడీ భార్యపై ఇంటెర్నేషనల్ అరెస్ట్ వారెంట్..

 భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ నోటీసు జారీ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. 

Red Corner Notice issued Against Nirav Modis Wife In Money-Laundering Cases in india
Author
Hyderabad, First Published Aug 25, 2020, 3:39 PM IST

న్యూ ఢీల్లీ: విదేశీ రుణాల కుంభకోణంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ భార్య అమీ మోడీపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు అరెస్ట్ వారెంట్‌ జారీ చేసింది. భారతదేశంలో ఆమెపై నమోదైన మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఈ నోటీసు జారీ చేశారు.

గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అమీ మోదీని అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్ నగరంలో రెండు అపార్టుమెంటులను 30 మిలియన్ డాలర్లు కొనుగోలు చేసినందుకు లబ్ధిదారిగా ఆరోపించినందుకు అమీ మోదీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్‌లో పేర్కొంది.

ఈ అపార్ట్‌మెంట్లు అక్టోబర్‌లో సిజ్ చేసిన విదేశీ ఆస్తులలోని 637 కోట్లలో భాగంగా ఉన్నాయి, ఇందులో లండన్‌లోని 56.97 కోట్ల డాలర్ల విలువైన ఫ్లాట్ కూడా ఉంది. రెడ్ కార్నర్ నోటీసు కూడా వారిని ఇండియాకి రప్పించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. నీరవ్ మోడీ, అతని సోదరుడు నేహల్ (బెల్జియం పౌరుడు), అతని సోదరికి వ్యతిరేకంగా ఇలాంటి నోటీసులు ఇచ్చారు.

నీరవ్ మోడీ (48) అతని మామ మెహుల్ చోక్సీ (60) ఇద్దరూ విదేశీ రుణాలు పొందటానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్  (పిఎన్‌బి) పేరిట నకిలీ హామీలతో కూడిన కుంభకోణంలో నిందితులు. మే నెలలో దాఖలు చేసిన చార్జిషీట్‌లో 6,498.20 కోట్ల రూపాయల నిధులను నీరవ్ మోడీ మళ్లించినట్లు సిబిఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఆరోపించింది.

also read 

మరో  రూ.7,080.86 కోట్లు మెహుల్ చోక్సీ అక్రమంగ  పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ విచారణ ప్రారంభించడానికి ముందే ఇద్దరూ 2018లో భారతదేశం నుండి పారిపోయారు. నీరవ్ మోడీ గత ఏడాది లండన్‌లో అరెస్టయ్యాడు, ప్రస్తుతం అతను వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు, అక్కడ నుండి అతనిని భారతదేశానికి అప్పగించే ప్రయత్నాలు జరుతున్నాయి.

ఈ నెల ప్రారంభంలో అతను యూ‌కే కోర్టు ముందు సాధారణ రిమాండ్ విచారణలో వీడియో లింక్ ద్వారా హాజరైన తరువాత ఆగస్టు 27 వరకు రిమాండ్‌కు పంపించారు. మెహుల్ చోక్సీ కరేబియన్ ద్వీపం ఆంటిగ్వాలో ఉన్నాడు, అతనికి అక్కడ పౌరసత్వం పొంది ఉన్నారు.

భారతదేశానికి తిరిగి రాకపోవడానికి ఆరోగ్య కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అన్ని చట్టపరమైన పద్దతులు పూర్తి చేసిన తర్వాత తన పౌరసత్వం రద్దు చేస్తామని ఆంటిగ్వా ప్రధాన మంత్రి గాస్టన్ బ్రౌన్ గత ఏడాది చెప్పారు.

సిబిఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో నేహాల్ మోడీ పేరు కూడా ఉంది, అతను తనపై ఆరోపించిన నేరానికి సంబంధించిన ఆధారాలను, సాక్ష్యాలను దుబాయ్‌లో మాయం చేసినట్లు అతనిపై అభియోగాలు మోపినట్లు అధికారులు తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios