Asianet News TeluguAsianet News Telugu

పాలు, పెరుగు అమ్మకాల రికార్డు.. గత సంవత్సరంతో పోలిస్తే భారీగా పెరిగిన వినియోగం..

 కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్  ట్రేడ్ పేరు మిల్మా. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సహకార సంఘం. అలాగే ఈ ఏడాది ఓనం రోజున పెరుగు విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని మిల్మా తెలిపింది.

Record of sale of milk and curd during this festival, consumption increased compared to last year
Author
First Published Sep 10, 2022, 5:43 PM IST

కేరళ ప్రభుత్వ యాజమాన్యంలోని పాల సహకార సంస్థ మిల్మా ఈ సంవత్సరం ఓనం పండగ సందర్భంగా పాలు, పెరుగు ఇంకా వాటి ఉత్పత్తులను రికార్డు స్థాయిలో విక్రయించింది. ఈ ఏడాది సెప్టెంబరు 4 నుంచి 7వ తేదీ వరకు ఓనం పండుగను జరుపుకుంటారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పాలు, ఉత్పత్తుల విక్రయాలు భారీగా పెరిగాయి.

మిల్మా ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కాలంలో మొత్తం 94,59,576 లీటర్ల పాలు అమ్ముడయ్యాయి, ఈ గణాంకాలు గతేడాది ఓనం పండగ కంటే 11.12% ఎక్కువ. సెప్టెంబర్ 8న తిరువోణం నాడు అత్యధికంగా 35,11,740 లీటర్ల పాల విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ రోజు పాల విక్రయాలు 7.03% పెరిగాయి.

కేరళ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్  ట్రేడ్ పేరుని మిల్మా అని పిలుస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సహకార సంఘం. అలాగే ఈ ఏడాది ఓనం రోజున పెరుగు విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయని మిల్మా తెలిపింది.

మిల్మా చైర్మన్ కెఎస్ మణి మాట్లాడుతూ మా ఉత్పత్తులపై వినియోగదారులకున్న నమ్మకం, కృషి వల్లే ఈ రికార్డును సాధించగలిగామని చెప్పారు. దేశీయంగా పాల ఉత్పత్తి తగ్గినప్పటికీ ఈ లోటును తీర్చేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని పాల మార్కెటింగ్‌ సంఘాలతో అవసరమైన ఏర్పాట్లు చేశామని కెఎస్ మణి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios