Asianet News TeluguAsianet News Telugu

రతన్ టాటా బర్త్ డే: ఇండియాలోనే మొట్టమొదటి 100% 'దేశీ' కారు నుండి ఆయన గురించి తెలియని కొన్ని విషయాలు..

1959 సంవత్సరంలో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివాడు. 1962లో భారతదేశానికి తిరిగి రాకముందు, అతను లాస్ ఏంజిల్స్‌లో జోన్స్ అండ్ ఎమ్మోన్స్‌లో పనిచేశాడు. 

Ratan Tata is credited for making countrys first 100% desi car know these unheard things related to him
Author
First Published Dec 28, 2022, 3:59 PM IST

ఈ రోజు అంటే డిసెంబర్ 28 భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త అండ్ టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా 85వ పుట్టినరోజు. రతన్ టాటా సుప్రసిద్ధ వ్యాపారవేత్తగానే కాకుండా మోటివేషనల్ స్పీకర్‌గా కూడా. అతను 28 డిసెంబర్ 1937న ముంబైలో నావల్ టాటా అండ్ సునీ టాటా దంపతులకు జన్మించాడు. రతన్ టాటా దేశంలోని ప్రతిష్టాత్మకమైన టాటా కుటుంబంలో ఒకరు. ఇంకా 25 ఏళ్ల వయసులోనే అతను టాటా గ్రూప్‌లో కెరీర్‌ ప్రారంభించాడు.

ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ 
1959 సంవత్సరంలో అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ చదివాడు. తరువాత 1962లో భారతదేశానికి తిరిగి రాకముందు, అతను లాస్ ఏంజిల్స్‌లో జోన్స్ అండ్ ఎమ్మోన్స్‌లో పనిచేశాడు. 1962లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత అతను టాటా గ్రూప్‌లో చేరాడు. అతను జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ డివిజన్‌లో  తన మొదటి ఉద్యోగం పొందాడు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మేనేజ్‌మెంట్ కోర్సు చేశాకా, 1991లో టాటా గ్రూప్‌ చైర్మన్‌ అయ్యారు. ఇవన్నీ రతన్ టాటా గురించి అందరికీ తెలిసిన విషయాలే. అయితే రతన్ టాటా గురించి కొందరికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటంటే..

 భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా తయారైన కారు
భారతదేశంలో మొట్టమొదటి పూర్తి కారు ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ కారు పేరు టాటా ఇండికా. ఈ కారు 100% భారతదేశంలోనే తయారు చేయబడింది, ఈ కారు మొదట 1998 ఆటో ఎక్స్‌పో అండ్ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో ప్రదర్శించారు. ఇండికా పెట్రోల్ అండ్ డీజిల్ ఇంజిన్‌లలో అందుబాటులో ఉన్న మొదటి దేశీయ కారు. రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూప్ ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్లు ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్‌లను కొనుగోలు చేసి అంతర్జాతీయంగా అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత చవకైన కారు టాటా నానోను తయారు చేసిన ఘనత కూడా రతన్ టాటా సొంతం.

 రతన్ టాటా వల్ల అమ్మమ్మ 
రతన్ టాటా పదేళ్ల వయస్సు వరకు టాటా ప్యాలెస్‌లో అతని అమ్మమ్మ లేడీ నవాజ్‌బాయి వద్ద పెరిగారు

 అమెరికన్ టెక్ దిగ్గజం IBMలో ఉద్యోగం ఆఫర్ చేసినప్పటికీ, రతన్ టాటా భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు అలాగే టాటా స్టీల్‌తో  వృత్తిని ప్రారంభించాడు. అతని కుటుంబ సభ్యులే కంపెనీ యజమానులు, కానీ అతను సాధారణ ఉద్యోగిగా కంపెనీలో పనిచేయడం ప్రారంభించాడు. టాటా స్టీల్ ప్లాంట్‌లో సున్నపురాయిని ఫర్నేసుల్లో వేయడం లాంటి పని కూడా చేశాడు.

 విమానాలు, కార్లలో ప్రయాణలంటే  అంటే చాలా ఇష్టం
రతన్ టాటాకు విమాన ప్రయాణం అంటే చాలా ఇష్టం. 2007లో ఎఫ్-16 ఫాల్కన్‌ను నడిపిన తొలి భారతీయుడిగా అతను  గుర్తింపు పొందాడు. ఆయనకు కార్లంటే కూడా చాలా ఇష్టం. అతని కార్ల సేకరణలో మసెరటి క్వాట్రోపోర్టే, మెర్సిడెస్ బెంజ్ S-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ 500 SL, జాగ్వార్ ఎఫ్-టైప్ వంటి కార్లు ఉన్నాయి.

 ఛైర్మన్  అవమానించినప్పుడు
 90వ దశకంలో ఇండిగోను తొలిసారిగా ప్రారంభించినప్పుడు, కంపెనీ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. ఆ సమయంలో సవాళ్లను ఎదుర్కొంటున్న టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విభాగాన్ని విక్రయించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. ఇందుకోసం రతన్ టాటా అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్‌తో మాట్లాడారు. మాట్లాడుతున్న సమయంలో, బిల్ ఫోర్డ్ అతనిని వెక్కిరించాడు ఇంకా మీకు ఏమీ తెలియదు,

మీరు ప్యాసింజర్ కార్ల విభాగాన్ని ఎందుకు ప్రారంభించారు? నేను ఈ ఒప్పందం చేసుకుంటే అది మీకు గొప్ప ఉపకారం అవుతుంది. ఫోర్డ్ ఛైర్మన్ ఈ మాటలకు రతన్ టాటా చాలా బాధపడ్డాడు కానీ  వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ప్యాసింజర్ కార్ల విభాగాన్ని విక్రయించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుని తనదైన శైలిలో తనెంటో  నిరూపించుకున్నాడు.

తొమ్మిదేళ్ల తర్వాత
ఫోర్డ్‌తో డీల్‌ వాయిదా వేసిన తర్వాత రతన్ టాటాకు తనెంటో  నిరూపించుకునే అవకాశం లభించింది, రతన్ టాటా స్వదేశానికి తిరిగి వచ్చి టాటా మోటార్స్ కార్ల విభాగంపై దృష్టి సారించారు, ఇంకా చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. ఫోర్డ్ అధినేతతో సంభాషణ జరిగిన దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత, టాటా మోటార్స్ కార్లు ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేసుకున్నాయి. కంపెనీ కార్లు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న విభాగంలో చేర్చబడ్డాయి. మరోవైపు ఫోర్డ్ కంపెనీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మునిగిపోతున్న ఫోర్డ్ కంపెనీని రక్షించే బాధ్యతను టాటా తీసుకున్నాడు,  తొమ్మిదేళ్ల క్రితం తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. సవాళ్లను ఎదుర్కొంటున్న ఫోర్డ్‌ను రక్షించేందుకు రతన్ టాటా  ప్రముఖ బ్రాండ్‌లు జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్‌లను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. అయితే దీని కోసం అమెరికా వెళ్లకుండా ఫోర్డ్ ఛైర్మన్‌ను భారత్‌కు పిలిచి ఒప్పందం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios