ముడిచమురు పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బుధవారం ఉదయం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. 

న్యూఢిల్లీ. గత 24 గంటల్లో ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధర గణనీయంగా తగ్గింది. బ్రెంట్ క్రూడ్ మూడు నెలల్లో రెండవసారి 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయింది, అయితే WTI ఇప్పుడు 95 డాలర్ల వద్ద ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముడిచమురు పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు బుధవారం ఉదయం జారీ చేసిన పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.96.72 లభిస్తోంది. ఏప్రిల్ 6 నుండి చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచలేదు, అయితే క్రూడ్ ధరలు ఒకేసారి బ్యారెల్‌కు 140 డాలర్ల వరకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ధర మంగళవారం ఉదయం 105.9 డాలర్లుగా ఉంది, ఈ రోజు బ్యారెల్‌కు 99.7 డాలర్లుగా మారింది. WTI ధర బ్యారెల్‌కు 95.5 డాలర్లు.

నాలుగు మహానగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
ఢిల్లీ పెట్రోల్ రూ. 96.72, డీజిల్ రూ.89.62 
 ముంబై పెట్రోల్ రూ. 109.27, డీజిల్ రూ. 95.84
చెన్నై పెట్రోల్ రూ. 102.63, డీజిల్ రూ. 94.24
కోల్‌కతా పెట్రోల్ రూ. 106.03, డీజిల్ ధరలు లీటరుకు రూ.92.76
హైదరాబాద్‌లో రూ.109.66, డీజిల్ రూ .97.82,

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ధరలను జారీ చేస్తారు. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర వస్తువులను జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. 

ఈ విధంగా పెట్రోల్, డీజిల్ తాజా ధరలను కూడా తెలుసుకోవచ్చు, మీరు SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSPని 9224992249 నంబర్‌కు, BPCL వినియోగదారులు RSPని 9223112222 నంబర్‌కు పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. HPCL వినియోగదారులు HPPriceని 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.