Asianet News TeluguAsianet News Telugu

త్వరలో బంగారం, ఆభరణలపై గోల్డ్ హాల్‌మార్కింగ్ చట్టం: దీని వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

ఈ ఏడాది జనవరిలో బంగారు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 1 జూన్ 2021 నుండి హాల్‌మార్కింగ్ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. 

pm narendra modi government new law for gold here you know from when this law will implement
Author
Hyderabad, First Published Nov 14, 2020, 3:01 PM IST

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా గోల్డ్ హాల్‌మార్కింగ్ చట్టాన్ని అమలు చేయబోతోంది. ఈ ఏడాది జనవరిలో బంగారు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 1 జూన్ 2021 నుండి హాల్‌మార్కింగ్ పథకం దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది.

కొత్తగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 దేశంలో అమల్లోకి వస్తుండటంతో వినియోగదారులను జ్యువెలర్స్  స్టోర్లు మోసం చేసే అవకాశాలు ఉండవు. ఈ కొత్త చట్టం బంగారం, బంగారు ఆభరణాలకు కూడా వర్తిస్తుంది.

కొత్త చట్టం ప్రకారం వినియోగదారులను మోసం చేయలేవు. ఆభరణాల షోరూమ్‌లు 22 క్యారెట్ల బంగారం అని పేర్కొంటూ 18 క్యారెట్లను బంగారం విక్రయిస్తుంటారు, ఒకవేళ ఎవరైనా అలా చేస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు, జైలు శిక్ష తప్పదు. 

also read బిల్ గేట్స్ వెంచర్‌లో ముకేష్ అంబానీ భారీ పెట్టుబడులు.. ...

కొత్త చట్టం ప్రకారం జరిమానా, జైలు శిక్ష రెండు కూడా విధించే అవకాశం కూడా ఉంది. అయితే, జ్యువెలర్స్ అసోసియేషన్ దీనిని వ్యతిరేకిస్తోంది, హాల్ మార్కింగ్ పథకాన్ని ఇంత తక్కువ సమయంలో అమలు చేయడం కష్టమని వాదిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఆభరణాలు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్రింద వారు రిజిస్టర్ చేసుకోవాలి.

హాల్‌మార్కింగ్ లేదా ప్రభుత్వ హామీ
, ఈ ఏడాది జూలైలో గోల్డ్ హాల్‌మార్కింగ్ చట్టాన్ని అమలు గడువును పెంచాలని అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది, దీనిని కేంద్ర ప్రభుత్వం 2021 జూన్ వరకు పెంచింది. గోల్డ్ హాల్‌మార్క్ అనేది ఒక రకమైన ప్రభుత్వ హామీ అని కేంద్ర ప్రభుత్వం వివరించింది.

ఇది దేశంలో ఏకైక బి‌ఐ‌ఎస్ చేత నిర్ణయించబడుతుంది. భవిష్యత్తులో మీరు ఆభరణాలను విక్రయించాలనుకుంటే  మీకు బంగారం కోసం మంచి ధర లభిస్తుంది. 

హాల్‌మార్కింగ్ కేంద్రాలుఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆభరణాలకు ఏడాది సమయం ఇచ్చింది, తద్వారా ఆభరణాల పాత స్టాక్‌ను ఈ  సంవత్సరంలో క్లియర్ చేస్తాయి. దేశంలో హాల్ మార్కింగ్ కేంద్రాల సంఖ్యను కూడా పెంచుతున్నారు.

ఒక అంచనా ప్రకారం, ప్రస్తుతం దేశంలో సుమారు 900 హాల్‌మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి, దీనిని మరింత పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios