Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ప్రస్తుతం  ఢిల్లీ మరియు కోల్‌కతాలో డీజిల్ ధర ఐదు పైసలు, ముంబై, చెన్నైలలో లీటరుకు ఆరు పైసలు పెరిగింది.ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ , కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలు వరుసగా రూ .74.81 నుండి రూ .77.49, రూ .80.46, రూ .77.77 కు పెరిగింది. 

petrol, diesel prices will hike againa
Author
Hyderabad, First Published Nov 29, 2019, 3:23 PM IST

ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలలో పెట్రోల్ ధర లీటరుకు ఐదు పైసలు, ముంబై నగరంలో లీటరుకు నాలుగు పైసలు ఇంతకు ముందే పెరిగి  ఉండగా. ప్రస్తుతం  ఢిల్లీ మరియు కోల్‌కతాలో డీజిల్ ధర ఐదు పైసలు, ముంబై, చెన్నైలలో లీటరుకు ఆరు పైసలు పెరిగింది.

also read కార్వీ చీఫ్‌ రాజీనామా...ఫిన్‌టెక్‌కు త్వరలో కొత్త చైర్మన్?


పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి, గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్న తరువాత ఢిల్లీ, కోల్‌కతా మరియు చెన్నైలలో పెట్రోల్ లీటరుకు ఐదు పైసలు మరియు ముంబైలో నాలుగు పైసలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఢిల్లీ మరియు కోల్‌కతాలో డీజిల్ ధరను ఐదు పైసలు పెరిగింది మరియు నాలుగు రోజుల తర్వాత చెన్నైలో లీటరుకు ఆరు పైసలు పెరిగింది.


ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ , కోల్‌కతా, ముంబై, చెన్నైలలో పెట్రోల్ ధరలు వరుసగా రూ .74.81 నుండి రూ .77.49, రూ .80.46, రూ .77.77 కు పెరిగింది. నాలుగు మెట్రో నగరాలలో డీజిల్ ధర వరుసగా రూ .65.78 నుండి  రూ .68.19, రూ .69, రూ .69.53 కు పెరిగింది.

also read  ఆ మూడు బీమా సంస్థల విలీనం...15 వేల ఉద్యోగాలకు ఎసరు...


ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్లో క్రూడ్ ఆయిల్ అయిన బ్రెంట్ క్రూడ్  ఫిబ్రవరి ఒప్పందం ప్రకారం బ్యారెల్కు 63.05 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, ఇది మునుపటి సెషన్తో పోలిస్తే 0.35 శాతం తగ్గింది.అదే సమయంలో న్యూయార్క్ మెర్కాంటైల్ ఎక్స్ఛేంజ్లో అమెరికన్ లైట్ క్రూడ్ బ్యారెల్కు 58.23 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెస్ట్ టెక్సాస్ యొక్క జనవరి ఒప్పందంలో 0.15 శాతం క్షీణించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios