ఇంధన ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ పై 26 పైసలు,డీజిల్‌ పై 13పైసలు పెంచాయి. 

దేశంలో కరోనా కేసుల తగ్గుదల, లాక్ డౌన్ సడలింపుతో పాటు ఇంధన ధరల డిమాండ్ కూడా పెరుగుతోంది. దీంతో నేడు ప్రభుత్వ చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి. బుధవారం అంటే ఈ రోజు పెట్రోల్ ధరపై 25 పైసలు, డీజిల్ ధరపై 13 పైసలు పెరిగింది.

ఈ పెంపు తరువాత దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. బుధవారం ఢీల్లీ మార్కెట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.66 చేరగా, డీజిల్ ధరపై 13 పైసలు పెంపుతో లీటరుకు రూ .87.41 కు చేరుకుంది. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.46 కాగా డీజిల్‌ ధర రూ. 95.28 గా ఉంది.

మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై పెంపు 25వసారి. అలాగే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గత 26 రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ .6.34 పెరిగగా, డీజిల్ ధర కూడా లీటరుకు రూ.6.63 పెరిగింది.

నగరం పెట్రోల్ డీజిల్
ఢీల్లీ 96.66 87.41
ముంబై 102.82 94.84
చెన్నై 97.91 94.04 
కోల్‌కతా 96.58 90.25

also read ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.. వీటి పై ప్రభుత్వ ఆదాయం ఎంత ? ...

 భోపాల్ పెట్రోల్ ధర రూ.104.85, డీజిల్ ధర రూ .96.05, బెంగళూరు పెట్రోల్ ధర రూ .99.89, డీజిల్ ధర లీటరుకు రూ.92.66, పాట్నా పెట్రోల్ ధర రూ .98.73, డీజిల్ ధర రూ.92.72, డీజిల్ ధర లీటరుకు రూ .92.27.

మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు ?
నిన్న అంటే మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. సోమవారం పెరిగిన ధరలపై పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, సోమవారం పెట్రోల్‌పై 29 పైసలు, డీజిల్‌పై 30 పైసలు పెరిగాయి. అప్పుడు ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.87.28 చేరుకుంది.

ఎప్పటికప్పుడు పెరుగుతున్న ధరల కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, లడఖ్ లో పెట్రోల్ ధర ఇప్పటికే లీటరుకు రూ .100 దాటింది.

జూన్ 15న ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే ?

ఢీల్లీ- పెట్రోల్ ధర రూ .96.41, డీజిల్ ధర రూ .87.28
ముంబై - పెట్రోల్ ధర రూ .102.58, డీజిల్ ధర రూ .94.70 
చెన్నై - పెట్రోల్ ధర రూ .97.69, డీజిల్ ధర రూ .91.92 
కోల్‌కతా- పెట్రోల్ ధర రూ .96.34, డీజిల్ ధర రూ .90.12 
భోపాల్ - పెట్రోల్ ధర రూ .104.59 కాగా, డీజిల్ ధర లీటరుకు 95.91 రూపాయలు
బెంగళూరు - పెట్రోల్ ధర రూ .99.63 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .92.52
పాట్నా - పెట్రోల్ ధర రూ.98.49 ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ .92.59
రాంచీ - పెట్రోల్ ధర రూ .92.51, డీజిల్ ధర లీటరుకు రూ .92.13