దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మే 21 నుండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని ప్రముఖ నగరాలు ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, ముంబై, లక్నో, హైదరాబాద్ లో ఈరోజు పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడానికి ముందు దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా తరువాత రూ. 96.72కి చేరింది, డీజిల్ ధర ప్రస్తుతం లీటరుకు రూ. 89.62గా ఉంది. ముంబైలో ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. దాదాపు రెండు నెలలుగా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.

దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మే 21 నుండి ధరలు స్థిరంగా ఉన్నాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

ముంబై: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర: లీటరుకు 94.27

ఢిల్లీ: పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర: రూ. 89.62

చెన్నై: పెట్రోలు ధర: లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర: రూ. 94.24

కోల్‌కతా: పెట్రోల్ ధర: లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర: రూ. 92.76

బెంగళూరు: పెట్రోలు: లీటరుకు రూ. 101.94, డీజిల్: లీటరుకు రూ. 87.89

లక్నో: పెట్రోలు: లీటరుకు రూ. 96.57, డీజిల్: రూ. 89.76

హైదరాబాద్

పెట్రోలు: లీటరుకు రూ. 109.66

డీజిల్: లీటరుకు రూ. 97.82


గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో చమురు కంపెనీలు గురువారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.