IOCL తాజా అప్డేట్ ప్రకారం ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్ రూ.94.24 వద్ద స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడితే, కోల్కతాలో పెట్రోల్ రూ. 106.03, డీజిల్ రూ. 92.76 గా ఉంది.
ప్రభుత్వ చమురు కంపెనీలు శుక్రవారం పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. గత రెండు నెలలుగా చమురు ధరలపై ఉపశమనం కోనసాగుతుంది. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72కి, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. హైదరాబాద్ పెట్రోల్ ధర రూ. 109.64, డీజిల్ ధర లీటరుకు రూ. 97.8గా ఉంది.
IOCL తాజా అప్డేట్ ప్రకారం ముంబైలో పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63గా ఉంది. మరోవైపు డీజిల్ ధర లీటర్ రూ.94.24 వద్ద స్థిరంగా ఉంది. పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడితే, కోల్కతాలో పెట్రోల్ రూ. 106.03, డీజిల్ రూ. 92.76 గా ఉంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) సహా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.
ముడి చమురు ధర
గత ట్రేడింగ్ సెషన్లో యునైటెడ్ స్టేట్స్ నుండి వీక్ డిమాండ్తో క్రూడాయిల్ ధరలు బాగా పడిపోయిన తరువాత శుక్రవారం ఉదయం స్థిరంగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 17 సెంట్లు పెరిగి బ్యారెల్ $104.03 వద్ద ట్రేడవుతున్నాయి. రాయిటర్స్ ప్రకారం, WTI క్రూడ్ బ్యారెల్ $ 96.35 వద్ద ఉంది.